Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రోడ్డుపై గొడవ ఘటన కేసులో… సిద్ధూకు జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు!

రోడ్డుపై గొడవ ఘటన కేసులో… సిద్ధూకు జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు!

  • 1988 నాటి కేసులో సిద్ధూకు జైలు శిక్ష
  • సిద్ధూ కొట్టిన దెబ్బలకు చనిపోయిన గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి 
  • ఏడాది పాటు జైలు శిక్షను విధించిన సుప్రీంకోర్టు

పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన ఘటనలలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బలు గుర్నామ్ తలకు బలంగా తగలడంతో ఆయన చనిపోయారు. ఈ కేసులోనే సిద్ధూకు సుప్రీంకోర్టు శిక్షను విధించింది.

ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ పాటియాలాలోని సెషన్స్ కోర్టు 1999 సెప్టెంబర్ 22న సిద్ధూని, అతని అనుచరుడుడిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును మృతుడి కుటుంబ సభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు. కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం సిద్ధూని దోషిగా ప్రకటిస్తూ, ఆయనకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ 2006లో తీర్పును వెలువరించింది. దీంతో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే, తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసుకునే వెసులుబాటును సిద్ధూకు కల్పించింది.

Related posts

యూపీ ఎన్నికల్లో ఒకే స్తానం నుంచి అజాం ఖాన్ భార్య ,కొడుకు నామినేషన్!

Drukpadam

ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ … ఇటీవల తుమ్మల తో భేటీ పై జిల్లాలో ఉత్కంఠత …

Drukpadam

కేసీఆర్ ఆహ్వానం మేరకే తెలంగాణకు వెళ్లాను: అఖిలేశ్ యాదవ్!

Drukpadam

Leave a Comment