Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు!

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు!
-ప్ర‌స్తుతం అన్ని వాహ‌నాల వేగం గంట‌కు 40 కిలో మీటర్లు
-తాజాగా వాహ‌నాలు, ఆయా రోడ్ల‌పై వేగ ప‌రిమితి వేర్వేరుగా ప్ర‌క‌ట‌న‌
-అత్య‌ధిక వేగంగా కార్ల‌కు గంట‌కు 60 కిలో మీట‌ర్లు
-కాల‌నీల్లో అన్ని వాహ‌నాల వేగం గంట‌కు 30 కిలో మీట‌ర్లు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితిని పెంచుతూ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ కార్యాల‌యం బుధ‌వారం నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టిదాకా జీహెచ్ఎంసీ ప‌రిధిలో అన్ని ర‌కాల వాహ‌నాల వేగ ప‌రిమితి గంట‌కు 40 కిలో మీట‌ర్లుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వేగాన్ని మించితే ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధిస్తున్నారు. అయితే తాజాగా ఈ వేగ ప‌రిమితిని పెంచ‌డంతో పాటుగా ఆయా వాహ‌నాల వేగ ప‌రిమితుల‌ను వేర్వేరుగా నిర్ణ‌యించారు.

డివైడ‌ర్లు ఉన్న చోట (డ‌బుల్ లేన్‌) కార్లు గంట‌కు 60 కిలో మీట‌ర్ల వేగంతో వెళ్లేందుకు అనుమ‌తించిన పోలీసు శాఖ‌… ఆ ప్రాంతాల్లో బ‌స్సులు, బైకుల స్పీడును మాత్రం గంట‌కు 50 కీలొ మీట‌ర్లుగా నిర్ణయించింది. ఇక న‌గ‌ర ప‌రిధిలో డివైడ‌ర్లు లేని చోట కార్ల వేగాన్ని గంట‌కు 50 కీలో మీట‌ర్లు కాగా… బ‌స్సులు, బైకుల వేగం మాత్రం గంట‌కు 40 కీలో మీట‌ర్లుగా ఉంది. ఇక కాల‌నీల్లో అన్ని ర‌కాల వాహ‌నాల వేగం 30 కిలో మీట‌ర్ల‌కు మించ‌రాద‌ని పోలీసు శాఖ ప్ర‌క‌టించింది.

Related posts

తెలంగాణ ఎన్నికల ఫలితంపై ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర విశ్లేషణ

Ram Narayana

ప్రజారవాణాకు ఆటంకం కలిగిస్తే ఉక్కుపాదం…మంత్రి పువ్వాడ హెచ్చరిక!

Drukpadam

Drukpadam

Leave a Comment