Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ ను పొగిడేందుకు పోటీలు పడ్డ పార్టీలు నేతలు …భారత రత్న ఇవ్వాలని డిమాండ్ !

ఎన్టీఆర్ ను పొగిడేందుకు పోటీలు పడ్డ పార్టీలు నేతలు …
-ఇన్ని సంత్సరాల తర్వాత టీఆర్ యస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాటు లో నివాళి
-నందమూరి తారక రామారావు గొప్ప నేత: వైఎస్ తనయ షర్మిల
-ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న నేతలు, అభిమానులు
-అనేక సంస్కరణలు తెచ్చిన నేత అని కొనియాడిన షర్మిల
-ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న టీఆర్ఎస్ నేతలు

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ లో స్పందించారు.

పటేల్, పట్వారీ వ్యవస్థల రద్దు, చట్టసభల్లో బీసీలకు అవకాశాలు, రూ.2కే కిలో బియ్యం, స్త్రీలకు ఆస్తి హక్కు, సింగిల్ విండో విధానం వంటి పథకాలు, సంస్కరణలు చేపట్టిన గొప్ప నేత నందమూరి తారక రామారావు అని షర్మిల కీర్తించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నట్టు తెలిపారు.

అటు, తెలంగాణ మంత్రులు, అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా హైదరాబాదులో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డితో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడు లేనిది ఎన్టీఆర్ ను ఇంత ఓను చేసుకోవటానికి కారణం ఏమిటనేది విదితమే …ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు . అందువల్ల వారిని మచ్చిక చేసుకోవడంతోపాటు ఆసామాజికవర్గాన్ని తమ మార్గంలోకి తెచ్చుకోవాలనే ఆలోచనతోనే ఎన్టీఆర్ పై ప్రేమ కురిపిస్తున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి.

Related posts

జగన్ అక్రమాస్తుల కేసు.. మొత్తం వ్యవహారాన్ని విడివిడిగా చూస్తే నేరం కనిపించదన్న సీబీఐ!

Drukpadam

రైతు ఉద్యమం నేపథ్యం లో కేంద్రంపై సుప్రీం సీరియస్

Drukpadam

హైకోర్టు తీర్పుతో ఎన్నికల కోసం ఏపీ అధికారుల పరుగులు

Drukpadam

Leave a Comment