Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేపే వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం

ఢిల్లీలో అభిమానుల కోలాహలం

ఖమ్మం ఎం పి నామ నాగేశ్వరరావు తో కలిసి ఢిల్లీ చేరుకున్న వద్ధిరాజు

టీఆర్ యస్ రాజ్యసభ సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వద్ధిరాజు రవిచంద్ర రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రవిచేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమానికి కొద్దిమందినే అనుమతించనున్నారు. అయితే ఆయన అభిమానులు కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున ఢిల్లీకి తరలివచ్చారు. ఖమ్మం ,వరంగల్ జిల్లాలనుంచే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి ఆయన హితులు, సన్నిహితులు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.

టీఆర్ యస్ లోకసభ పక్షనేత ఖమ్మం ఎం పి నామ నాగేశ్వరరావు తో కలిసి వద్ధిరాజు రవిచంద్ర హైద్రాబాద్ నుంచి ఢిల్లీ కి వెళ్లారు. ఆయన వెంట కుటుంబసభ్యులు కూడ ఉన్నారు. వారికి లోకసభ టీఆర్ యస్ పక్షనేత నామ నాగేశ్వరరావు నివాసంలో అతిధ్యం ఇచ్చారు.

Related posts

కర్ణాటక కాంగ్రెస్ దే: శరద్ పవార్

Drukpadam

కరోనా పై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చంద్రబాబు డిమాండ్

Drukpadam

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్‌ను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు!

Drukpadam

Leave a Comment