Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు.. వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు….

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు.. వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు!——నిందితుల్లో ఓ సంస్థ చైర్మన్ కుమారుడు, ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు, -బల్దియా కార్పొరేటర్ కుమారుడు
-బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కుమారుడి వీడియో వైరల్
-అతడిపైనా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు
-ప్రభుత్వ సంస్థ చైర్మన్ అధికారిక వాహనంలోనే అత్యాచారం
-నిందితుల పక్కా ప్లాన్
-గోవా వెళ్తున్నట్టు నమ్మించి తమ సెల్‌ఫోన్లను మాత్రమే పంపిన వైనం
-మరో సిమ్‌కార్డు తీసుకుని కర్ణాటకకు చెక్కేసిన నిందితులు

జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ సంస్థ చైర్మన్‌కు ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనంలోనే బాధిత బాలికపై అత్యాచారం జరిగినట్టు తెలుస్తోంది. ఆ కారుపై ‘ప్రభుత్వ వాహనం’ అన్న స్టిక్కర్ కూడా ఉంది. మొయినాబాద్ సమీపంలో ఈ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్ (18), ఓ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అమేర్‌ఖాన్ (18), ప్రభుత్వ సంస్థ చైర్మన్ కుమారుడు (16), బల్దియా కార్పొరేటర్ కుమారుడు, సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకుడి కుమారుడు కలిసి బాలికపై అత్యాచారం చేసినట్టు పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించినట్టు తెలుస్తోంది.

శుక్రవారం రాత్రే సాదుద్దీన్‌ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే, ప్రభుత్వ సంస్థ చైర్మన్ కుమారుడిని, బల్దియా కార్పొరేటర్ కుమారుడిని జువైనల్ హోంకు తరలించారు. ఓ ఎమ్మెల్యే కుమారుడు (17) కూడా బాలికతో సన్నిహితంగా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అతడిపైనా కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. కాగా, నిందితుల్లో ముగ్గురు ప్రజాప్రతినిధుల కుమారులే కావడం గమనార్హం.

అత్యాచారానికి ముందు అసలేం జరిగిందంటే?.. గత నెల 28న జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌కు వచ్చిన బాలికను ఇంటి వద్ద దిగబెడతామంటూ చైర్మన్ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు బెంజికారులో ఎక్కించుకున్నారు. పబ్ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తున్న సమయంలో కారులోనే బాలికపై అత్యాచారయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ తర్వాత బంజారాహిల్స్ రోడ్డు నంబరు 14లో ఉన్న కాన్సు బేకరీ వద్ద కాసేపు ఆగారు. అక్కడికి డ్రైవర్ ఇన్నోవా కారును తీసుకొచ్చాడు. చైర్మన్ కుమారుడు కారు తీసుకుని ఇప్పుడే వస్తామని డ్రైవర్‌కు చెప్పి వెళ్లినట్టు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.

ఆ తర్వాత నిందితులందరూ కలిసి బాలికను బెంజి కారు నుంచి ఇన్నోవా కారులోకి మార్చి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇన్నోవా కారులో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నప్పటికీ ఆ తర్వాత కాసేపటికే అతడు కారు దిగి బేకరీవైపు వెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే, అతడు కూడా బాధిత బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుండడంతో అతడిని ఎ6గా చేర్చాలని పోలీసులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

పోలీసులను పక్కదారి పట్టించేందుకు నిందితులు పక్కాగా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. తామంతా గోవా వెళ్తున్నట్టు గత నెల 29న స్నేహితులకు చెప్పారు. అయితే, వీరు గోవా వెళ్లకుండా ఇద్దరు వ్యక్తులకు సెల్‌ఫోన్లు ఇచ్చి అక్కడికి పంపారు. నిందితులు మరో సిమ్‌కార్డు తీసుకుని కర్ణాటక వెళ్లారు. మరోవైపు, అమ్నీషియా పబ్‌లో జరిగిన ఓ విద్యార్థి వీడ్కోలు పార్టీలో మద్యం సరఫరా కాలేదని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీకి బాధిత విద్యార్థిని సహా 153 మంది హాజరయ్యారు. మరోవైపు, బాధిత బాలిక ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

Related posts

చోరీకి గురైన జేపీ నడ్డా భార్య కారు లభ్యం.. ముగ్గురు నిందితుల అరెస్టు…

Ram Narayana

పెళ్లి వేడుకలో విషాదం …బాలుడు అనుమానాస్పద మృతి …!

Ram Narayana

కోడలిని చెరపట్టేందుకు ప్రయత్నించిన భర్తను గొంతుకోసి చంపేసిన మహిళ

Ram Narayana

Leave a Comment