Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పదో తరగతి విద్యార్థులతో లోకేశ్ జూమ్ మీటింగ్..ఎంటరైన వంశీ ,నాని …

పదో తరగతి విద్యార్థులతో లోకేశ్ జూమ్ మీటింగ్.. మధ్యలో ఎంటరైన వల్లభనేని వంశీ, కొడాలి నాని

  • విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యంతరం
  • మండిపడిన టీడీపీ నేతలు
  • వంశీ ఆఫీసు నుంచే లాగిన్ అయిన ఓ విద్యార్థిని
  • మాట్లాడే ప్రయత్నం చేసిన వంశీ
  • ఆ వెంటనే లైన్ కట్ చేసిన నిర్వాహకులు

పదో తరగతి విద్యార్థులతో టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే, జూమ్ మీటింగ్ నడుస్తుండగానే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నానిలు మధ్యలో ఎంటరయ్యారు.

వంశీ ఆఫీసులోనే ఉండి ఓ విద్యార్థిని లాగిన్ అయింది. దీంతో ఆయన ఈజీగా మీటింగ్ లోకి ప్రవేశించారు. లోకేశ్ తో మాట్లాడే వంతు ఆ విద్యార్థినికి వచ్చిన సందర్భంలో వల్లభనేని వంశీ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఆ జూమ్ మీటింగ్ లోకి సడన్ గా ప్రవేశించారు.
వాళ్లిద్దరూ ఇలా సడన్ ఎంట్రీ ఇవ్వడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్ లో వాళ్లు కనిపించడంతో ఇటు టీడీపీ నేతలు మండిపడ్డారు. కాగా, వంశీ జూమ్ మీటింగ్ లోకి ఎంటరవ్వగానే నిర్వాహకులు ఆ లైన్ వీడియోను కట్ చేశారు.

కాగా, పదో తరగతి విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తే.. కొడాలి నాని, వల్లభనేని వంశీ వెకిలినవ్వులతో శాడిజం చూపించారంటూ టీడీపీ మండిపడింది. నీచ రాజకీయానికి ఇదా సమయమంటూ ట్వీట్ చేసింది.

Related posts

ఫడ్నవిస్ తో విభేదాలపై స్పందించిన షిండే …మాది ఫెవికాల్ బంధమని వ్యాఖ్య …

Drukpadam

వికేద్రీకరణ పై ఏపీ వ్యూహాత్మక అడుగులు …పూర్తిసమగ్రమైన మెరుగైన బిల్లు తెస్తాం :సీఎం జగన్

Drukpadam

6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల వ్యూహాల‌పై భేటీ కానున్న బీజేపీ నేత‌ల‌ …

Drukpadam

Leave a Comment