Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జులై 18న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్… జులై 21న ఓట్ల లెక్కింపు!

జులై 18న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్… జులై 21న ఓట్ల లెక్కింపు!
ఈ నెల 15న రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌
ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌
జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు
రాష్ట్రప‌తి ఎన్నికల షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన సీఈసీ రాజీవ్ కుమార్‌

రాష్ట్రపతి ఎన్నిక షడ్యూల్ ను ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఢిల్లీ లోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు .రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పదవీకాలం జులై 24 తో ముగియనున్నందున ఈ లోపు ఎన్నికజరపడం అనివార్యం అయింది. ఇప్పటివరకు అధికార ,ప్రతిపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థికి ఇంకా ఎవరిపేరును ప్రకటించలేదు…అందరి చూపు అధికార బీజేపీ ఎవరిని అభ్యర్థిని పెడతారనేదానిపైనే ఉంది. బీజేపీ దాని మిత్రపక్షాలకు సంపూర్ణ మెజార్టీ లేనప్పటికీ , ఆంధ్రప్రదేశ్ ,ఒడిశా రాష్ట్రాల ఓట్లు వేయించుకోవడంద్వారా తేలిగ్గా బయట పడవచ్చునని ప్రధాని మోడీ మంత్రాంగం జరుపుతున్నారు . అందువల్ల బీజేపీ పెట్టె అభ్యర్థి ఎన్నిక లాంఛనమే అవుతుందనే అభిప్రాయాలే ఉన్నాయి.

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ ఈ షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15న జారీ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. జూన్ 15 నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తామ‌ని, 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని రాజీవ్ కుమార్ ప్ర‌కటించారు. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత జులై 21న ఓట్ల లెక్కింపును నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ పద‌వీ కాలం జులై 24తో ముగియ‌నుంద‌ని, ఈ నేపథ్యంలో జులై 25లోగా నూత‌న రాష్ట్రప‌తి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంద‌ని తెలిపిన రాజీవ్ కుమార్‌.. అందుక‌నుగుణంగానే షెడ్యూల్‌ను ఖ‌రారు చేశామ‌ని తెలిపారు. నామినేషన్ల ప‌ర్వం, ఓట్ల లెక్కింపు ఢిల్లీలోనే జ‌ర‌గ‌నుండ‌గా…పోలింగ్ మాత్రం పార్ల‌మెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ఆవ‌ర‌ణ‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించారు.

Related posts

విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో స్వలింగ సంపర్కులకు నో ఎంట్రీ ఆరోపణలు !

Drukpadam

2100 నాటికి 100 కోట్లకు తగ్గిపోనున్న భారత్ జనాభా!

Drukpadam

మంత్రి హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం…..

Drukpadam

Leave a Comment