Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఢిల్లీలో భారీ హోర్డింగ్.. కాసేపటికే తొలగింపు!

కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఢిల్లీలో భారీ హోర్డింగ్.. కాసేపటికే తొలగింపు!
-ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ దూరం
-విపక్ష నేతలు సమావేశమైన క్లబ్‌ ఎదురుగా భారీ హోర్డింగ్ ఏర్పాటు
-‘దేశ్ కా నేత కేసీఆర్’ అని పేర్కొంటూ ఆహ్వానం
-ఎవరు పెట్టారో ? ఎందుకు పెట్టారో ? ఎందుకు తొలగించారో ఎవరికీ తెలియదు

జాతీయ పార్టీ పెట్టబోతున్న కేసీఆర్ హోర్డింగ్ ఒకటి ఢిల్లీలో వెలసి కొద్దిసేపటికే తొలగించటం చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఎవరు పెట్టారు ? ఎందుకు పెట్టారు ? ఎందుకు తొలగించారనేదానిపై ఆసక్తి నెలకొన్నది . కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితిగా దాదాపు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ పేరుతోనే హోర్డింగ్ వెలిసింది.

ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను నెత్తికెత్తుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సహా పలువురు నేతలకు లేఖలు పంపారు. మమత లేఖను వైసీపీ పట్టించుకోకపోగా, టీఆర్ఎస్ మాత్రం తాము రాబోమని తేల్చి చెప్పింది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమే తన లక్ష్యమని పదేపదే చెబుతున్న కేసీఆర్.. ఈ సమాశానికి కాంగ్రెస్‌ను కూడా ఆహ్వానించడంతో రాబోమని స్పష్టంగా చెప్పేశారు.

కేసీఆర్ కానీ, ఆ పార్టీ ప్రతినిధులు కానీ ఈ సమావేశానికి హాజరు కాకున్నా దేశ రాజధానిలో కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేయడం విశేషం. ప్రతిపక్షాలు సమావేశమైన కానిస్టిట్యూషన్ క్లబ్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ హోర్డింగులో.. ‘దేశ్‌ కా నేత కేసీఆర్. ఢిల్లీకి హృదయపూర్వక స్వాగతం. తెలంగాణ వికాస పురుషుడు, విఖ్యాత కేసీఆర్ దేశానికి కొత్త దిశను ఇచ్చేందుకు వస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీతో కేసీఆర్ దేశ ప్రజలను ఉత్థాన స్థితికి తీసుకెళ్తారు’ అని రాసివుంది. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఆ హోర్డింగును తొలగించారు. ఈ హోర్డింగును ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు తీసేశారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి.

Related posts

గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి ఖాయం…..రేవంత్ రెడ్డి

Drukpadam

ఢిల్లీ రైతు ఉద్యమానికి ఖమ్మం ప్రజల జేజేలు

Drukpadam

తెలంగాణాలో భారత్ జోడో యాత్ర ఈనెల 24 నుంచి 13 రోజులు ..డీజీపీ అనుమతి కోరతామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!

Drukpadam

Leave a Comment