Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆదివాసీలపై ఇంత అమానుషంగా ? రాహుల్ ఫైర్ !

భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై ఇంత అమానుషమా?: సీఎం కేసీఆర్ పై రాహుల్ గాంధీ విమర్శలు!

  • పోడు భూమిపై హక్కు కోసం ఆదివాసీల పోరాటం
  • ఆక్రమణలంటూ కేసులు పెట్టిన అటవీశాఖ
  • ఆదివాసీలకు మద్దతు పలికిన రాహుల్ గాంధీ
  • కృతజ్ఞతలు తెలిపిన రేవంత్ రెడ్డి

మంచిర్యాల జిల్లాలో పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీలు పోరాడుతుండగా, అటవీ భూముల్లో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ అధికారులు ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తొలగించే క్రమంలో ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. ఆరుగురు ఆదివాసీ మహిళలను ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. మహిళలని కూడా చూడకుండా వారిని లాగిపారేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘జల్ జంగల్ జమీన్’ పోరాటంలో ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణలో భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై ప్రభుత్వ వైఖరి దారుణం అని పేర్కొన్నారు. అర్హులైన ఆదివాసీలకు పోడ్డు భూమి సాగు పట్టాలు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ సర్కారు ఆ తర్వాత వెనక్కి తగ్గిందని, ఇది ప్రజలకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు.

ఆదివాసీ గళాన్ని అణచివేసేందుకు పోలీసు బలగాలను వినియోగించడం అమానుషమని, ఇది తెలంగా ఆకాంక్షలకు అవమానం అని వివరించారు. కోట్లాది ప్రజల మనోభావాలను సాకారం చేయడానికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కూడా అందులో ప్రముఖ భాగం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Rahul Gandhi comes in support for Telangana Adivasis

Related posts

బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ లేని ఫ్రంట్ వ్యర్థం : శరద్ పవార్!

Drukpadam

మంత్రి ఈటల మాటల భావమేమి తీరుమలేశా ?

Drukpadam

గజ్వేల్‌కు ఎట్ల వస్తవో అంటివి కదా కేసీఆర్.. ఇప్పుడు కనిపించిందా బొమ్మ: సీతక్క!

Drukpadam

Leave a Comment