Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కామారెడ్డి జిల్లాలో దారుణం …కంటైనర్ ఢీకొని ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి ….

కామారెడ్డి జిల్లాలో దారుణం …కంటైనర్ ఢీకొని ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి ….
-ప్రయనుకులందరు అక్కడిక్కడే మృతి
-లారీ డ్రైవర్ ,క్లినర్ కు గాయాలు

అతివేగం రాంగ్ రూటు ప్రయాణం మనుషుల విలువైన ప్రాణాలు బలిగొంటుందని తెలిసినప్పటికీ తప్పులు చేయడం అలవాటుగా మారింది. రోడ్ ప్రమాదాల్లో అనేక ప్రాణాలు పోతున్నాయి. పోలీసులు చెప్పే ట్రాఫిక్ రూల్స్ బేఖాతర్ చేస్తున్నారు . ఫలితంగా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు . అందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో ఈ రోజు దారుణం చోటు చేసుకున్నది ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ తో సహా తిరుగుతూ లారీని గుద్దుకొని ప్రాణాలు కోల్పోవడం వళ్ళు గగుర్పొడిచే సీన్ గా ఉంది.

 

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని మద్నూరు మండలం మేనూరులోని జాతీయ రహదారిపై కంటైనర్‌ లారీ కిందకు ఆటో దూసుకెళ్లడంతో ఆరుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంటైనర్‌ లారీ హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ వెళ్తోంది. ఆటో మద్నూర్‌ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూట్‌లో వస్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పిన ఆటో.. ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీ కిందకు దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. కంటైనర్‌ లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. కాగా, ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఎక్కడి వారనే వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు . ఆటో వివరాలు , ప్రయాణికుల వివరాలు తెలుసుకుంటున్నారు

Related posts

చ‌లానా ఉంటే వాహ‌నాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదంటూ త‌ప్పుడు ప్ర‌చారం: -సైబ‌రాబాద్ పోలీసులు!

Drukpadam

నా అరికాళ్లపై పోలీసులు కుళ్ళ పొడిచారు : రఘురాం కృష్ణం రాజు

Drukpadam

పోలీసులమంటూ దారి దోపిడీలు.. బెంగళూరులో ముగ్గురి అరెస్ట్!

Drukpadam

Leave a Comment