Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ , ఏపీ ,రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్రలు :కేసీఆర్

తెలంగాణ , ఏపీ ,రాజస్థాన్, ఢిల్లీ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్రలు :కేసీఆర్
ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అడ్డమైన దారులు
న్యాయవ్యవస్థ కు చేతులు జోడించి వేడుకుంటున్న అప్రజాస్వామిక విధానాలకు అడ్డుకట్టవేయాలి
బీజేపీ పెద్దలే ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కీలక సూత్రధారులుగా ఉన్నారు .
బీజేపీ నేతలపై నిప్పులు చెరిగిన సీఎం
తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడి
అవి ఆషామాషీ ఆధారాలు కావని వ్యాఖ్యలు

దేశంలో ఇబ్బందికర పరిస్థిలు నెలకొన్నాయి. ప్రభుత్వాలను కూల్చేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు . దుర్మార్గం జరుగుతుంది.ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చటం పరిపాటిగా బీజేపీ మార్చింది. రాజస్థాన్ , ఏపీ , తెలంగాణ , ఢిల్లీ ప్రభుత్వాలను కూల్చేందుకు పథకం రూపొందించారు. అని తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ విధానాలపై ధ్వజమెత్తారు .గురువారం ప్రగతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో ఉన్న పెద్ద దొంగల చిట్టా మాదగ్గర ఉందని పేర్కొన్నారు . దేశంలో ప్రజాసమస్యలను పట్టించుకోవడంలేదు . నిరుద్యోగం పెరిగింది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దేశం ఆకలి రాజ్యాంగ మారుతుంది.దిగజారుడు రాజకీయాలు కొనసాగుతున్నాయి.మునుగోడులో సిగ్గు పడే పరిస్థితి. ఎంతకైనా తెగించాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యవహారశైలి ఉంది. ఎమ్మెల్యేలను కొంటారు …షిండేలను సృష్టిస్తారు .ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. టీఆర్ యస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు . వారి పన్నాగాలను మా ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారు. ఈ మొత్తం వ్యవరాన్ని సీసీ పీకెమెరాల్లో రికార్డు చేశాం . కోర్ట్ కు మొత్తం ఫుటేజీ సమర్పించాం .ఒక్కరికి మూడు పాన్ కార్డులు , డైవింగ్ లైసెన్స్లు ఉన్నాయి. ఇవి ఎలా వచ్చాయి. ఫామ్ హౌస్ ఫైల్స్ 3 గంటలు ఉన్నాయి.తుషార్ అనే వ్యక్తి గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై బీజేపీ టికెట్ తో పోటీచేశారు .ప్రజాస్వామ్యం దెబ్బతింటే దేశం నష్ట పోతుంది. దేశం దెబ్బ తింటే ప్రజలు నష్టపోతారు అని కేసీఆర్ అన్నారు .

ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం సింగిల్ కేసులా న్యాయవ్య వ్యవస్థ చూడొద్దు . ప్రస్వామ్యాన్ని బ్రతికించాలని చేతులు జోడించి మొక్కుతున్న … ఒక్కరికి 100 కోట్లు ఇస్తాం అని ఆఫర్ చేశారు . రోహిత్ రెడ్డి ఈ విషయాలు ముందుగానే రాష్ట్ర హోమ్ మంత్రికి తెలిపారు . ప్రలోభాలు పెట్టేందుకు 24 మంది ఉన్నారని చెబుతున్నారు .ఇప్పటికే దేశంలో 8 ప్రభుత్వాలను కూల్చమని అంటున్నారు
.కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాం .ఆపరేషన్ గురించి పూర్తిగా చెపుతున్నారు .దేశంలో బీజేపీకి అనుకూలంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు . ఈ నిధులన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి. దీనిపై విచారణ జరగాలి అని అన్నారు. గత కొంతకాలంగా నిందితులు ఎవరెవరితో మాట్లాడారని డేటా మా దగ్గర ఉంది.

ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడంపై తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అవి ఆషామాషీ ఆధారాలు కాదని అన్నారు. ఈ తంతు చాలా రోజులుగా జరుగుతోందని తెలిపారు. తన ప్రభుత్వాన్ని కూలగొడతామని చెబుతుంటే ఊరుకుని మౌనంగా ఉండాలా? అని ప్రశ్నించారు.

“గత నెలలో ఇక్కడకు రామచంద్రభారతి అనే ఒకాయన వచ్చాడు. అనేక ప్రయత్నాలు చేసి మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశాడు. వారు ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నారో అర్థమయ్యాక రోహిత్ రెడ్డి ఆ విషయం మాకు చెప్పాడు. దాంతో మేం హోంమంత్రికి ఫిర్యాదు చేశాం. దీనిపై సమగ్ర విచారణ జరగాలని కోరుకున్నాం.

ఆ వీడియో చాలా పెద్దది… మూడు గంటల నిడివితో ఉంది. కోర్టుల సౌకర్యం కోసం ఆ వీడియోని కుదించడం జరిగింది. ఆ వీడియోలో వాళ్లు ప్రస్తావించిన పేర్లు దేశంలోని పెద్ద నేతలవి. ఇప్పటికే మేం 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టాం, ఇంకో 4 రాష్ట్రాల్లో కూలగొడుతున్నాం అని చెప్పారు.

తెలంగాణలో కూలగొడతాం, ఆ తర్వాత ఢిల్లీ వంతు… ఢిల్లీలో ఇప్పటికే బేరాలు అయిపోయాయి… ఆ తర్వాత ఆంధ్రలో వెంటనే కూలగొడతాం, అది ముగిశాక మా టార్గెట్ రాజస్థాన్… అక్కడ కూడా కూలగొడతాం. ఇప్పటికే రాజస్థాన్ లో 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేశారు… అంటూ ఆ వీడియోలోని వ్యక్తులు చెబుతున్నారు.

ఏంటిది… దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఇతర రాష్ట్రాల్లోని వారు దీన్ని మౌనంగా భరించారేమో కానీ, ఇది తెలంగాణ… మా శాసనసభ్యులు వీరోచితంగా దీన్ని బయటపెట్టారు. ఈ రాక్షసుల కుట్రను బద్దలు కొట్టాలని భావించి పార్టీకి, ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఆ ముఠాను ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి, ఈ వ్యవహారమంతా బయటికి వచ్చింది. ఇది నిన్న మొన్నా జరిగింది కాదు… అనేక రోజులుగా జరుగుతోంది.

మా స్కానర్ లో ఉన్నారంటే మీకు వై కేటగిరీ భద్రత, ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి రక్షణ.. అన్నీ మేమే చూసుకుంటాం అని వాళ్లు చెబుతున్నారు… ఆ చెప్పే వ్యక్తి ఎవరు మంత్రా, లేక ప్రధానమంత్రా? ఇన్ కమ్ ట్యాక్స్ ను మేమే చూసుకుంటాం, ఈడీని మేమే చూసుకుంటాం అని ఇంత నిర్భయంగా ఈ రాజ్యాంగేతర శక్తులు మాట్లాడుతున్నాయి. ఈ వీడియోలో చూస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు.

ఈ ముఠా చిన్నది కాదు, 24 మంది ఉన్నాం అని వాళ్లు చెప్పడం మీరు చూస్తారు. ఒక్కొక్కరికి మూడు ఆధార్ కార్డులు, మూడేసి పాన్ కార్డులు, మూడేసి డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. వీళ్లలో కేరళలో రాహుల్ గాంధీపై పోటీ చేసిన తుషార్ అనే బీజేపీ నేత కూడా ఉన్నాడు. నాడు తుషార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అమిత్ షానే. ఈ కుట్రలో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వీళ్లకు ఇన్నేసి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఎలా వస్తున్నాయి?

ఈ వీడియోలను అన్ని రాష్ట్రాల డీజీపీలకు కూడా పంపిస్తున్నాము. ఈ ముఠాలో స్వామీజీలు కూడా ఉన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే వాళ్ల పని. మధ్యప్రదేశ్ లో కూలగొట్టాం, కర్ణాటకలో కూలగొట్టాం అని, కర్ణాటకలో ఎమ్మెల్యేలకు కూలీల వేషం వేసి ఎలా ట్రాక్టర్లలో తీసుకెళ్లారో కూడా వాళ్లు చెప్పడాన్ని ఈ వీడియోలో చూస్తారు. దేశంలో ఏమైనా చేయగలమన్న దురహంకారంతో మాట్లాడారు.

Related posts

ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల ఓట్లు 4 .91 లక్షలు

Drukpadam

ఒక్క మాటలో చెప్పాలంటే… దేశానికే దండగ మీరు!: కిషన్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్!

Drukpadam

నాగాలాండ్ ఘటనపై లోక్ సభలో ప్రకటన చేసిన అమిత్ షా!

Drukpadam

Leave a Comment