Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీకి ఘంటా గుడ్ బై …వైసీపీలో చేరతారని ప్రచారం …

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న గంటా శ్రీనివాసరావు?

  • కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు
  • వైసీపీలో చేరికపై బంధువులు, సన్నిహితులతో చర్చలు
  • డిసెంబర్ తొలి వారంలో వైసీపీలో చేరే అవకాశం

ఘంటా శ్రీనివాస్ రావు విశాఖ లో ప్రముఖ రాజకీయ నాయకులూ …ప్రస్తుతం టీడీపీలో ఉన్న చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. తరవాత ఆయన జనసేన లో చేరతారని అన్నారు . అది జరగలేదు … తర్వాత వైసీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఎందుకో ఆయన వెనక్కు తగ్గారు .తరువాత టీడీపీ అధినేత చంద్రబాబుకు తిరిగి దగ్గరైయ్యారు . దీంతో పార్టీ మారడంలేదని సంకేతాలు ఇచ్చారు .కానీ గత కొద్దిరోజులు టీడీపీని ఘంటా వీడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన వైపీసీలో చేరేందుకు సిద్ధమైయ్యారని కూడా అంటున్నారు .

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. గంటా పార్టీ మారుతారనే విషయాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గతంలోనే బహిరంగంగా చెప్పారు. అయితే ఆయన చెప్పినట్టుగా గంటా పార్టీ మారనప్పటికీ… టీడీపీకి మాత్రం దూరంగానే ఉంటూ వస్తున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పటికీ… గంటా మాత్రం ఈ విషయంపై మౌనంగానే ఉంటున్నారు.

ఇప్పుడు పార్టీ మారేందుకు గంటా సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై తన బంధువులతో కూడా ఆయన చర్చించినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం సినీ నటుడు చిరంజీవిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా పార్టీ మార్పుపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. గంటా వైసీపీలో చేరేందుకు అంతా సిద్ధమయిందని చెపుతున్నారు. డిసెంబర్ 1వ తేదీన తన జన్మదినం తర్వాత వైసీపీలో ఆయన చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్ తొలి వారంలో విశాఖలో జగన్ సభ జరగనుంది. ఈ సందర్భంగా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవచ్చని చెపుతున్నారు. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related posts

ఏపీ లో వైరల్ గా మారుతున్న ” పీకుడు ” భాష!

Drukpadam

కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు మహిళల మానప్రాణాలు తీసి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నడు: ష‌ర్మిల‌

Drukpadam

కాంగ్రెస్ అసమ్మతి నేత ఆజాద్ సొంతపార్టీపైనే నిందలు …

Drukpadam

Leave a Comment