Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పెళ్లి విందులో చికెన్ లేదని గొడవ …ఆగిన పెళ్లి ..!

పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదని వరుడి స్నేహితుల గొడవ.. ఆగిన వివాహం!

  • సోమవారం జరగాల్సిన వివాహం
  • ఆదివారం రాత్రి విందు ఇచ్చిన వధువు కుటుంబం
  • భోజనానికి వచ్చి చికెన్ లేదని గొడవ పడి వెళ్లిపోయిన వరుడి స్నేహితులు
  • ఆగిపోయిన పెళ్లి.. పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ
  • కౌన్సెలింగ్‌తో దిగివచ్చిన మగపెళ్లివారు

పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న కారణంతో మగ పెళ్లివారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌నగర్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన యువకుడికి, కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఉదయం వివాహం జరగాల్సి ఉండగా ఆదివారం రాత్రి ఆడపెళ్లివారు విందు ఏర్పాటు చేశారు. వధువుది బీహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబం కావడంతో విందులో అన్నీ శాకాహార వంటలే చేశారు.

విందు ఇక ముగుస్తుందన్న సమయంలో వరుడి తరపు స్నేహితులు భోజనాలకు వచ్చారు. అక్కడున్న శాకాహార వంటలు చూసి చికెన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి గొడవపడి తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది వధూవరుల కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. చివరికి నిన్న జరగాల్సిన వివాహం ఆగిపోయింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు జీడిమెట్ల సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో రేపు (బుధవారం) వివాహం జరిపించాలని నిర్ణయించారు.

Related posts

హైదరాబాద్ లోని స్టేట్ బ్యాంక్ లో కాల్పుల కలకలం…

Drukpadam

తెలంగాణాలో మరో మెడికో ఆత్మహత్య…

Drukpadam

యూపీ ఎస్పీ నేత ఇంట్లో నోట్ల కట్టల లెక్క తేలింది… రూ.177 కోట్లు స్వాధీనం!

Drukpadam

Leave a Comment