Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దేశంలో విపక్షాలు లేకుండా చేయాలనే మోడీ కుటిల యత్నాలు …విజయరాఘన్ ధ్వజం

విపక్షవిముక్తికీ బీజేపీ యత్నం

* ఏకఛత్రాధిపత్యం కోసం కుటిల యత్నాలు
* మోడీ, షా మాత్రమే శాశ్వతం కాదు
* వామపక్ష పాలన ఉంది కాబట్టే కేరళ అభివృద్ధి
* మోడీ పాలనలో ఆకలిదేశంగా భారత్
* తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో సంఘం జాతీయ అధ్యక్షులు విజయరాఘవన్

ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న బీజేపీ చివరకు విపక్షాలు కూడా లేకుండా చేయాలని చూస్తున్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు విజయరాఘవన్ అన్నారు. మోడీ, అమిత్ షా  మాత్రమే శాశ్వతం కాదన్నారు. క్షేత్రస్థాయిలో మన ప్రజాస్వామ్య పురోగామి శక్తులను మనవైపు తిప్పుకోవాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలోని వేదగిరి శ్రీనివాసరావునగర్ (భక్తరామదాసు కళాక్షేత్రం)లోని అమరవీరుల ప్రాంగణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు పి.సోమయ్య అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు అమవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. సంతాప తీర్మానాన్ని వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ ప్రవేశపెట్టారు. మహాసభ రెండు నిమిషాల మౌనం పాటించి అమరవీరును స్మరించుకున్నది. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షత వహించిన మహాసభనుద్దేశించి విజయరాఘవన్ మాట్లాడుతూ. వీరతెలంగాణ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. బిజేపీ. నిరంకుశ రాజకీయాలు చేస్తూ పార్లమెంట్, అసెంబ్లీలను ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. సామాన్య ప్రజానీకం గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదనీ, కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని విమర్శించారు. మనిషి అని అనే భావనను కూడా నశింపజేస్తున్నదన్నారు. వెనుకబడిన వర్గాలు బతికే పరిస్థితి కూడా లేదన్నారు. లౌకిక విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. వామపక్ష పాలనలో ఉంది కాబట్టే కేరళ అభివృద్ధిలో, మానవాభివృద్ధి సంచిలో నెంబర్ వన్ గా ఉందని చెప్పారు కాబట్టే భూసంస్కరణలు, భూ పునఃపంపిణీ తమ రాష్ట్రంలో సాధ్యమైందని తెలిపారు. కేరళ రూపంలో దేశానికి ప్రత్యామ్నాయ పాలన ఉందన్నారు. తమ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది వ్యవసాయ కార్మికులుంటే తమ సంఘంలో 25 లక్షల మంది సభ్యులున్నారని తెలిపారు. సమస్యలు ఎదుర్కొంటున్న ఇతరులూ సంఘంలో ఉన్నారని చెప్పారు. 75 ఏండ్ల ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుతున్న తరుణంలోనూ ఆకలి దేశంగా ఉండటం శోచనీయమన్నారు. ఈ విషయంలో ప్రపంచంలో మన దేశం 121వ స్థానంలో ఉండటం దారుణమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్టీ, ఎస్సీ మహిళలపై ఆకృత్యాలు అధికమయ్యాయని చెప్పారు. ఉ మ్మడి ఆంద్రప్రదేశ్లోనూ పేదల భూములు గుంజుకునే చర్యలు అయ్యాయని చుట్టుపక్కల కూలీ పోరాటాలు చెప్పుకోదగ్గవనీ, ముదిగొండలో ఏడుగురు భూ పోరాటంలో ప్రాణ త్యాగం చేసిన విషయాన్ని స్మరించుకున్నారు. భూపోరాట్లో సంఘం చొరవ మంచి ఫలితాలను రాబట్టిందన్నారు.‍

* డాక్టరైనా.. యాక్టరైనా కష్టజీవుల పక్షానే..
– ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్

డాక్టరయినా, యాక్టరయినా కష్టజీవుల పక్షాన నిలబడాల్సిందేనని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్ అన్నారు. రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల పని అయిపోయింది అనే వారికి నిన్నటి సభ కమ్యూనిస్టులతోనే ప్రజలకు పని ఉందనే ఆవశ్యకతను చాటిందని చెప్పారు. ఈ మహాసభల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కౌలురైతు, రైతుబందు. రుణ సౌకర్యం, విద్యా, వైద్యం లాంటి కనీస సౌకర్యాల కోసం ఫలవంతమైన చర్చలు మహాసభల్లో జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులందర్నీ ఐక్యం చేసి కుల, మత ప్రాంతీయ ధోరణిలతో పనిచేసే విచ్ఛిన్నకర శక్తులను దూరం చేస్తూ ధృడమైన ప్రణాళిక రూపొందించాలని ఆకాంక్షించారు.

 

* దున్నే భూములను లాగి కార్పొరేట్లకు ధారాదత్తం
– వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పి.సోమయ్య

దున్నేవాడికే భూమి అని వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకులు పుచ్చలపల్లి సుందరయ్య పోరాడితే నేటి పాలకులు మాత్రం కార్పొరేటు శక్తులకే భూమి అన్నట్టు చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పి.సోమయ్య అన్నారు. నిజమైన అన్నదాత అంటే వ్యవసాయ కార్మికుడేనని తెలిపారు. వ్యవసాయ కార్మికులకు ఓ చట్టం ఉండాలని సీపీఐ(ఎం) నేత, మాజీ ఎంపీ హరికిషన్ సూర్జిత్ పార్లమెంట్లో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. రెవెన్యూ, మార్కెటింగ్, ఎక్సైజ్ పన్నుల తదితర రూపాల్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో అత్యధికంగా వ్యవసాయ కార్మికుల ద్వారానే లభిస్తున్నదని చెప్పారు. వాటిలో 10 శాతం వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. సమాజానికి అట్టడుగున ఉంటూ అన్యాయానికి గురవుతున్నది వ్యవసాయ కార్మికులేనని చెప్పారు. 1934లోనే సుందరయ్య వారి కోసం ప్రత్యేక సంఘాన్ని స్థాపించారన్నారు. మహాసభలో యాదాద్రి భువనగిరి నాయకులు రొడ్డ అంజయ్య, వేముల మహేందర్ జ్ఞాపకార్ధం ఆ జిల్లా నుంచి జ్యోతిని తీసుకొచ్చి విజయరాఘవన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, ఉపాధ్యక్షులు విక్రమ్. కేరళ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్. ప్రధానకార్యదర్శి తీగల సాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వెస్టీ, స్కైలాబ్బాబు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామనాయక్, డీవైఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్, వ్యకాస జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వర్లు, వేదగిరి శ్రీనివాసరావు సతీమణి కళావతి. వేముల మహేందర్ సతీమణి. రొడ్డ అంజయ్య కుమారుడు పాల్గొన్నారు. సీఎన్ఎమ్ కళాకారులు తమ ఆటపాటలతో సభను ఉ త్తేజపర్చారు.

Related posts

ఎన్ఎస్ యుఐ వెంకట్ అరెస్టును ఖండించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!

Drukpadam

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మార్గరెట్ అల్వా!

Drukpadam

ఇంతకీ పొంగులేటి చూపులెటు …జి -30 దిశగా ఆలోచన చేస్తున్నారా …?

Drukpadam

Leave a Comment