Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒక్క చేప ఖరీదు రూ.2.2 కోట్లు… ఎక్కడో చూడండి!

ఒక్క చేప ఖరీదు రూ.2.2 కోట్లు… ఎక్కడో చూడండి!

  • జపాన్ లో బ్లూ ఫిన్ టూనా చేప వేలం
  • కొనుగోలు చేసిన ఒనోడెరా గ్రూప్
  • ఉత్తర అమెరికాలోని ఒమా వద్ద చిక్కిన 212 కిలోల టూనా

సముద్రంలో దొరికే చేపల్లో అత్యంత రుచికరమైన వాటిలో టూనా చేప ఒకటి. ఇది భారీ సైజులో ఉండే చేప. దీని ఖరీదు అలా ఇలా ఉండదు. దీన్ని కొనేందుకు బడా వ్యాపారులు పోటీ పడతారు.

సాధారణంగా పెద్ద టూనా చేపలను వేలం వేస్తారు. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా జపాన్ లో వేలం వేసిన ఓ టూనాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ టూనా బరువు 212 కిలోలు కాగా, దీనికి వేలంలో రూ.2.2 కోట్ల ధర పలికింది. ఇది బ్లూ ఫిన్ రకం టూనా కావడంతో దీనికి అంత ధర పలికింది.

టోక్యో సిటీలోని టయోసు ఫిష్ మార్కెట్ లో ఈ వేలం నిర్వహించగా, జపాన్ లో సూషీ రెస్టారెంట్లు నడిపే ఒనోడెరా గ్రూప్ చేజిక్కించుకుంది. కాగా, ఈ భారీ మత్స్యరాజాన్ని ఉత్తర అమెరికాలోని ఒమా వద్ద సముద్ర జలాల్లో పట్టుకున్నారు. ఇక్కడ దొరికే బ్లూ ఫిన్ టూనాలను బ్లాక్ డైమండ్స్ అని పేర్కొంటారు. వీటికి లభించే ధర అలాంటిది మరి.

Related posts

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళ సీఎం స్టాలిన్‌కే క్రేజ్.. ప్రధానిగా రాహుల్ ఓకే అన్న తమిళ ప్రజలు: సి ఓటర్ సర్వే!

Drukpadam

డీఎల్ఎఫ్ లంచం కేసులో లాలూకు సీబీఐ క్లీన్ చిట్!

Drukpadam

చిక్కుల్లో చినజియ్యర్ …సమ్మక్క సారలమ్మపై అనుచిత వ్యాఖ్యలు కేసు నమోదు!

Drukpadam

Leave a Comment