Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇక చుట్టపు చూపు కాదు …ఖమ్మంలోనే ఉంటా …రేణుకాచౌదరి!

ఇక చుట్టపు చూపు కాదుఖమ్మంలోని ఉంటారేణుకాచౌదరి!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ 2 పార్లమెంట్ గెలుస్తాం
ఖమ్మంలోని ఉంటాపార్టీకి పూర్వ వైభవం తెస్తా
బీఆర్ఎస్ లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు
కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న రేణుక
కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని వ్యాఖ్య

మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి చాలాకాలం తర్వాత మంగళవారం ఖమ్మం వచ్చారు . మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఖమ్మం రావడం మీడియా సమావేశం పెట్టడం కాకతాళీయమే ! కొద్దినెలల క్రితం ఆమె ఏపీలో పర్యటించారు . అమరావతి ఏపీకి ఏకైక రాజధాని కావాలని కోరుతూ జరుగుతున్నా ఉద్యమానికి ఆమె మద్దతు ప్రకటించారు . గుడివాడలో పోటీచేస్తానని చెప్పారు . తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు . కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవరాల కమిటీలో కూడా ఆమె ఉన్నారు . తిరిగి ఖమ్మం రాజకీయాలపై కేంద్రీకరించేందుకు నిర్ణయించుకున్నట్లు మీడియా సమావేశంలో చెప్పారు . ఇప్పుడు చుట్టపు చూపుగా కాకుండా ఇక్కడే మకాం వేస్తామని చెప్పారు . క్యాంపు కార్యాలయం కూడా ప్రారంభించారు . ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మీడియాతో మాట్లాడారు .

పార్టీ పేర్లు, రంగులు మార్చినంత మాత్రాన నాయకులను ప్రజలు నమ్మరని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. బీఆర్ఎస్ లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని అన్నారు.

ఇక ఖమ్మం జిల్లాతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. ఖమ్మంలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో గెలిచి తీరుతామని చెప్పారు. గత ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానంలో నాలుగు లక్షలకు పైగా ఓట్లను సాధించామని అన్నారు. తాను ఖమ్మంలోనే ఉంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పాలేరు నుంచి పర్ణశాల వరకు అభివృద్ధి చేశానని తెలిపారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందనికేంద్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేణుక ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు. హిందుత్వ ముసుగులో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో నిర్శహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు.

Related posts

జగన్ కాచుకో …కేంద్రంతో ఒక ఆటాడిస్తా ….విశాఖ సభలో పవన్ ఫైర్ ….!

Ram Narayana

12 డిమాండ్లతో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌తో క‌లిసి దీక్ష‌కు దిగిన చంద్ర‌బాబు…

Drukpadam

మమతా బెనర్జీ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ!

Drukpadam

Leave a Comment