Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పారాసిటమాల్ ట్యాబ్లెట్ ధర ఇకపై రూ. 2.76.. సవరించిన ఎన్‌పీపీఏ!

పారాసిటమాల్ ట్యాబ్లెట్ ధర ఇకపై రూ. 2.76.. సవరించిన ఎన్‌పీపీఏ!
-128 రకాల ఔషధాల ధరలను సవరించిన ఎన్‌పీపీఏ
-సవరించిన ఔషధాల్లో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు కూడా
-తగ్గనున్న ఔషధాల ధరలు

మెడికల్ షాపుల్లో మందులను ఇష్టం వచ్చిన ధరలతో విక్రయించకుండా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) చర్యలు చేపట్టింది. 128 రకాల ఔషధాల ధరలను సవరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌పీపీఏ తాజా ధరల సవరణ ప్రకారం.. ఇకపై సిట్రిజన్ ట్యాబ్లెట్‌ను రూ. 1.68, పారాసిటమాల్‌ను రూ. 2.76, ఇబుప్రొఫెన్ (400 ఎంజీ) రూ.1.07కు విక్రయించాల్సి ఉంటుంది.

అలాగే, డయాబెటిస్ రోగులు ఉపయోగించే గ్లిమెపిరైడ్, వోగ్లిబొస్, మెట్‌ఫార్మిన్ ధరను రూ. 13.83గా నిర్ణయించింది. ఎన్‌పీపీఏ సవరించిన ధరల జాబితాలో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు అమోక్సిసిలిన్, క్లవ్లానిక్ యాసిడ్, ఆస్తమా రోగులు వేసుకునే సాల్బుటమాల్, కేన్సర్ ఔషధం ట్రస్టుజుమాబ్, బ్రెయిన్ ట్యూమర్ చికిత్సకు ఉపయోగించే టెమోజోలోమైడ్ వంటివి ఉన్నాయి.

Related posts

రాజస్థాన్ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో సరికొత్త ప్రచారం!

Drukpadam

చంద్రబాబు బ్యారక్ లోకి గంజాయి వేశారు.. పెన్ కెమెరాతో చంద్రబాబు కదలికలు రికార్డ్ చేశారు: న్యాయవాది లక్ష్మీనారాయణ ఆరోపణ…

Ram Narayana

శివాలయంలో ఎంత మంది చనిపోయారో తెలియడం లేదు: వైసీపీ ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి

Drukpadam

Leave a Comment