Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బంది!

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బంది!

  • రాంగోపాల్ పేట పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం
  • మంటల్లో కాలిబూడిదవుతున్న డెక్కన్ స్పోర్ట్స్ మాల్
  • ఐదుగురిని కాపాడిన సహాయక సిబ్బంది
  • తీవ్ర పొగతో ఉక్కిరిబిక్కిరైన అగ్నిమాపక సిబ్బంది
  • ఆసుపత్రికి తరలింపు

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం తెలిసిందే. ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనంలో ఇప్పటికీ మంటలు ఎగసిపడుతున్నాయి. మూడు వైపుల నుంచి మొత్తం 15 ఫైరింజన్లను మోహరించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు రసాయనాలు కూడా వినియోగిస్తున్నారు.

కాగా, దట్టమైన పొగ కారణంగా ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇప్పటివరకు భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. భవనంలో ఇక ఎవరూ లేరని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

మరోపక్క, డెక్కన్ స్పోర్ట్స్ మాల్ కు పక్కనే ఉన్న నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. పరిసరాల్లోని భవనాల్లో నివసిస్తున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు.

Related posts

ఏపీలో పొత్తులపై జాతీయ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు: పురందేశ్వరి

Ram Narayana

కృష్ణా జిల్లాలోకలకలం … జగన్ కటౌట్ కు నిప్పు…

Drukpadam

హైదరాబాద్ ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్…!

Drukpadam

Leave a Comment