Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రోడ్ ప్రమాదాలకు కొత్త భాష్యం చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే !

రోడ్ ప్రమాదాలకు కొత్త భాష్యం చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే !
-రోడ్లు బాగుండడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఎమ్మెల్యే నారాయణ పటేల్ …
-ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే
-రోడ్లు బాగుంటే వాహనాలు వేగంగా వెళతాయని వెల్లడి
-దాంతో వాహనాలు అదుపుతప్పే అవకాశముందని వివరణ

బీజేపీకి చెందిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే నారాయణ పటేల్ రోడ్ ప్రమాదాలకు కొత్త భాష్యం చెప్పారు .రోడ్లు బాగుంటే వేగంతో వాహనాలు దూసుకొని పోవడంవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సూత్రీకరించారు . గుంతలుగా ఉంటె వేగం తగ్గి ప్రమాదాలు జరగవని కూడా ఆయన ఆనడం ఆపార్టీలోని చర్చనీయాంశంగా మారింది . దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం లేదా బీజేపీ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది .

మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ రోడ్డు ప్రమాదాలకు కొత్త కారణం చెప్పారు. రోడ్లు బాగుండడం వల్లే మధ్యప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

రోడ్లు సాఫీగా ఉంటే, వాహనాలు అధికవేగంతో వెళుతుంటాయని, దాంతో అదుపుతప్పి ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నారాయణ పటేల్ విశ్లేషించారు. తన నియోజకవర్గంలో ఈ సమస్య తనకు కూడా ఎదురైందని తెలిపారు. దాంతో మీడియా ప్రతినిధులు స్పందిస్తూ, రోడ్లు అధ్వానంగా ఉంటే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందా? అని ఆయనను ప్రశ్నించారు.

అందుకు ఆ ఎమ్మెల్యే బదులిస్తూ, కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. నారాయణ పటేల్ ఖాండ్వా జిల్లాలోని మంథనా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Related posts

Drukpadam

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ విజ్ఞప్తులకు అమిత్ షా సానుకూల స్పందన!

Drukpadam

యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ సందర్బంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు…

Drukpadam

Leave a Comment