Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మణిపూర్ లో బీజేపీ నేతను కాల్చి చంపి లొంగిపోయిన ప్రధాన నిందితుడు!

మణిపూర్ లో బీజేపీ నేతను కాల్చి చంపి లొంగిపోయిన ప్రధాన నిందితుడు!

  • కారులో వచ్చి కాల్చి చంపిన దుండగులు
  • ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • హెచ్చరికల తర్వాత లొంగిపోయిన ప్రధాన నిందితుడు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బీజేపీ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. తౌబల్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బీజేపీ రాష్ట్ర ఎక్స్ సర్వీస్‌మెన్ సెల్‌కు లైష్‌రామ్ రామేశ్వర్ సింగ్ కన్వీనర్‌గా ఉన్నారు. క్షేత్రి లీకై ప్రాంతంలోని ఆయన ఇంటి గేటు సమీపంలో హత్యకు గురయ్యారు. నంబరు లేని కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు నిన్న ఉదయం 11 గంటల సమయంలో అతి సమీపం నుంచి కాల్చి చంపారు. తూటాలు సింగ్ ఛాతీలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆయనను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. 

కొన్ని గంటల తర్వాత నిందితుల్లో ఒకడైన నావోరెమ్ రికీ పాంటింగ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిష్ణుపూర్ జిల్లాలోని కీనౌ‌కు చెందిన రికీ పాంటింగ్‌ను ఇంఫాల్‌ వెస్ట్ జిల్లాలోని హావోబమ్ మరక్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన 46 ఏళ్ల అయేక్‌పామ్ కేషోర్జిత్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడికి ఆశ్రయం కల్పించొద్దని ప్రజలను హెచ్చరించిన పోలీసులు లొంగిపోవాల్సిందిగా నిందితుడిని హెచ్చరించారు.  

ఆ తర్వాత కాసేపటికి ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని కమాండో కాంప్లెక్స్ వద్ద పోలీసులకు లొంగిపోయాడు. హవోబమ్ మరక్‌కు చెందిన నిందితుడి నుంచి ఎ.32 క్యాలిబర్ లైసెన్స్‌డ్ తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రెండు మ్యాగజైన్లు, 9 కాట్రిడ్జ్‌లను కూడా సీజ్ చేశారు. రికీ పాంటింగ్ కారును డ్రైవ్ చేయగా, బీజేపీ నేతలపై కేషోర్జిత్ కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల వెనక ఉన్న కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అమితాబ్‌ బచ్చన్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్…

Drukpadam

ఏవి సుబ్బారెడ్డి పై దాడికేసులో భూమా అఖిల ప్రకియ అరెస్ట్ …

Drukpadam

ఖమ్మం జిల్లాకు చెందిన కేరళ ఐపీఎస్ అధికారి పై సస్పెన్షన్ వేటు వేసిన సీఎం విజయన్!

Drukpadam

Leave a Comment