Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కర్ణాటకలో బలిజలు రాజకీయంగా ఎదగాలంటే కేసీఆర్ వెంట నడవాలి …ఎంపీ వద్దిరాజు!

కర్ణాటకలో బలిజలు రాజకీయంగా ఎదగాలంటే కేసీఆర్ వెంట నడవాలి …ఎంపీ వద్దిరాజు!
-తెలంగాణాలలో కేసీఆర్ ,మున్నారు కాపులకు పెద్దపీట వేశారు .
-స్థానిక సంస్థల్లో సింహభాగం మున్నూరు కాపులకే
-కేసీఆర్ ప్రజలందరి భద్రత, సంక్షేమం, కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు
-విదేశాలలో ఉన్నత చదువులకు 20లక్షలు ఉచితంగా అందిస్తున్నరు:ఎంపీ రవిచంద్ర
-ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి భూమి, డబ్బులు కేటాయించిన మహానేత కేసీఆర్:ఎంపీ రవిచంద్ర
-కర్ణాటక బలిజల న్యాయమైన డిమాండ్స్ సాధనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుంది:ఎంపీ రవిచంద్ర

కర్ణాటకలో బలిజలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే కేసీఆర్ స్థాపించిన బీఆర్ యస్ తో కలిసి నడవాలని బీఆర్ యస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపు నిచ్చారు . బెంగుళూర్ ఫ్రీడమ్ పార్క్ లో ఏర్పాటు చేసిన బలిజల సంకల్పసభలో పాల్గొని ప్రసంగించారు .ఈ సభకు ఎంపీ రవిచంద్ర మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు ఆకుల రజిత్,మరికల్ పోత సుధీర్ కుమార్, ప్రముఖ వాస్తుశిల్పి ముద్దు వినోద్ లతో కలిసి అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు

కర్ణాటక లో బలిజలు తమను బీసీల్లో చేర్చాలని ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ వద్దిరాజు అతిధిగా పాల్గొని వారి న్యాయమైన డిమాండ్స్ కు మద్దతు ప్రకటించారు . కేసీఆర్ ఆధ్వరంలో ఏర్పాటైన బీఆర్ యస్ తోనే సాధ్యమని అన్నారు .దేశంలో కేసీఆర్ పరిపాలన కావాలని అనేక రాష్ట్రాలు కోరుకుంటున్నామని అందువల్ల కర్ణాటక బలిజల న్యాయమైన సమస్యలు పరిస్కారం కావలనంటే బీఆర్ యస్ తోనే సాధ్యమని అందువల్ల బీఆర్ యస్ కు మద్దతు ప్రకటించాలని కోరారు .

అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా సుపరిపాలన అందిస్తున్నారని,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు.. తెలంగాణ ఒక మినీ ఇండియాగా వెలుగొందుతున్నదని,దేశవిదేశాలకు చెందిన వివిధ జాతులు,మతాలు,భాషల వాళ్లు స్వేచ్ఛగా జీవిస్తున్నారని రవిచంద్ర వివరించారు.సుస్థిర పాలనా వ్యవస్థ,శాంతిభద్రతలు సజావుగా ఉండడంతో బహుళజాతి సంస్థలు తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడ్తున్నాయని పేర్కొన్నారు.

విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లే యువతకు రూ. 20లక్షలు ఉచితంగా అందిస్తున్న మహానేత కేసీఆర్ అని రవిచంద్ర కొనియాడారు. మున్నూరుకాపులకు సముచిత పదవులిచ్చి గౌరవిస్తున్నారంటూ,బీసీ సంక్షేమ శాఖను గతంలో జోగు రామన్న, ఇప్పుడు గంగుల కమలాకర్ లకు కేటాయించడాన్ని గుర్తు చేశారు.హైదరాబాద్ మహానగర మేయర్ గా మొదట బొంతు రాంమోహన్, ఇప్పుడు గద్వాల విజయలక్ష్మీలను నియమించారని, రాజ్యసభకు కేశవరావు,తనను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు.ఇదేవిధంగా చెప్పుకుంటూపోతే స్థానిక సంస్థలలో సింహభాగం పదవులు మున్నూరుకాపులకే కేటాయించారని తెలిపారు.

బీసీ కులాల ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకునేందుకు గాను విలువైన భూములతో పాటు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు.కర్ణాటకలో బలిజలు గణనీయ సంఖ్యలో ఉన్నారని,రాష్ట్రాభివృద్ధిలో వీరి పాత్ర ప్రముఖమైందని, అయితే అత్యధికులు పేదలేనన్నారు.బీసీలుగా ఉన్న వీరిని 1984లో ఆ జాబితా నుంచి తొలగించడం తీవ్ర విచారకరమన్నారు.తమను బీసీ జాబితాలో తిరిగి చేర్చాలని,చట్టసభల ఎన్నికలలో సముచిత సంఖ్యలో సీట్లు , నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో తగు ప్రాధాన్యతనివ్వాలన్న బలిజల డిమాండ్స్ న్యాయమైనవని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ఈ డిమాండ్స్ సాధనకు తమ బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందని,ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెంటనే సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తమ సంకల్ప సభకు సంఘీభావం తెలిపి,బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించి, అమూల్యమైన సందేశమిచ్చిన ఎంపీ రవిచంద్రకు కర్ణాటక ప్రదేశ్ బలిజ సంఘం ప్రముఖులు ఎం.ఆర్.జయరాం,సీతారామయ్య తదితరులు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

అధికారపార్టీ చెప్పుచేతుల్లో పోలీసులు …బీజేపీ నేత విజయశాంతి ధ్వజం!

Drukpadam

తెలంగాణలో ఇటీవల ఎన్నికలు జరుపుకున్న పురమాలికల ఏలికలు వీరే

Drukpadam

పవన్ వ్యాఖ్యలు కొత్తగా ఉన్నాయి..ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు!

Drukpadam

Leave a Comment