Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

దేశంలో విప్లవాత్మక మార్పులు రావాలి …నాగలి పట్టే చేతులే శాసనాలు చేయాలి … నాందేడ్ లో  కేసీఆర్ !

దేశంలో విప్లవాత్మక మార్పులు రావాలి …నాగలి పట్టే చేతులే శాసనాలు చేయాలి … నాందేడ్ లో  కేసీఆర్ !
అందుకే ‘అబ్‌కీ బార్.. కిసాన్‌ సర్కార్’ అంటున్నాం
50 శాతంపైగా వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు
అందులో 16 కోట్ల మంది రైతులు …34 కోట్ల మంది వ్యవసాయ కూలీలు
నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభలో అనంతరం మీడియా సమావేశంలో బీఆర్ యస్ ఆలోచనలు వెల్లడించిన కేసీఆర్
దేశ పరిస్థితులను చూశాక టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్ గా మార్చామన్న కేసీఆర్
విద్యత్ ,నీటి ప్రాజక్టులు , వ్యవసాయరంగాల్లో స్పష్టమైన వైఖరితో ముందుకు వస్తున్నామని వెల్లడి
తమది రాజకీయ పోరాటం కాదని, జీవన్మరణ పోరాటమని వెల్లడి

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తామని అవి విప్లవాత్మకంగా ఉంటాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మనది వ్యవసాయ దేశం ఈరంగంపై 50 శాతంపైగా జీవిస్తున్నారు .నాగలి పట్టే చేతులే శాసనాలు చేయాలనీ అందుకోసం బీఆర్ యస్ కృషిచేస్తుందని అన్నారు . దేశాన్ని కాంగ్రెస్ బీజేపీలే 70 సంవత్సరాలు పాలించాయని అందులో 54 కాంగ్రెస్ , బీజేపీ 16 సంవత్సరాలు పాలించింది అయిన ప్రజల బ్రతుకులు మార్చలేకపోయిందని ధ్వజమెత్తారు . బీఆర్ యస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో అన్ని చట్టసభల్లో 33 శాతం సీట్ల సంఖ్యను పెంచడమే కాకుండా అవి మహిళలకే కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు .

ఎందుకు బీఆర్ యస్ పెట్టాల్సి వచ్చిందనే దానిపై కేసీఆర్ వివరణ ఇస్తూ దేశ పరిస్థితులను చూశాక గుణాత్మక మార్పురాకపోతే ప్రజల జీవితాలు ప్రధానంగా రైతులు , కూలీలా జీవితాలు బాగుపడవని భావించే టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్ గా మార్చామని చెప్పారు. తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతటా రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. భారత్ పేద దేశం కాదని, అమెరికా కంటే ధనిక దేశమని, బుద్ధి జీవుల దేశమని చెప్పుకొచ్చారు.

ఈరోజు మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. తాము ఎన్నాళ్లో ఎదురు చూశామని, ఇప్పుడు సమయం వచ్చిందని, నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన టైం వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు కాదని, ప్రజలు, రైతులు గెలవాలని అన్నారు.

దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. దేశంలో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి మరెక్కడా లేదని, కానీ ప్రజలు వంచనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో అనేక నదులు ఉన్నా నీటి కరువు ఎందుకని ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో కూటములు పాలన చేశాయని, కానీ మనదేశం ఆశించిన అభివృద్ధి సాధించలేదని అన్నారు. దేశంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని, దేశ నాయకత్వంలో మార్పు వస్తేనే ప్రగతి సాధ్యమని చెప్పారు.

కాంగ్రెస్ ,బీజేపీలు   రెండూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. మాంజాలు, విగ్రహాలు, పతంగులు, చివరికి జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయి. దేశమంతటా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయి?’’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేస్తున్నది రాజకీయ పోరాటం కాదని, జీవన్మరణ పోరాటమని చెప్పారు. ‘అబ్‌కీ బార్.. కిసాన్‌ సర్కార్’ నినాదంతో ముందుకు వచ్చామని కేసీఆర్‌ చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ చిన్న దేశంలో ఉందని, మరి ఇంత విశాల భారత్ లో కనీసం 2 వేల టీఎంసీల రిజర్వాయర్ ఎందుకు లేదని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడం లేదని ఆరోపించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వవచ్చని చెప్పారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయొచ్చని తెలిపారు.

Related posts

ప్రజల కోసం దెబ్బలు తినడానికి, జైలుకు వెళ్లడానికి, అవమానాలకు సిద్ధం:పవన్ కళ్యాణ్!

Drukpadam

కేసి వేణుగోపాల్ పై పోలిసుల దురుసు ప్రవర్తన …ప్రియాంక గాంధీ ఫైర్

Drukpadam

బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. పార్టీని వీడిన కీలక నేత గంగా ప్రసాద్‌!

Drukpadam

Leave a Comment