Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీదే విజయమంటున్న ఎగ్జిట్ పోల్స్…!

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడి!

  • ఈ నెల 16న త్రిపురలో ఎన్నికలు
  • నేడు మేఘాలయ, నాగాలాండ్ లో ముగిసిన పోలింగ్
  • త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీదే విజయమంటున్న ఎగ్జిట్ పోల్స్
  • మేఘాలయలో ఎన్ పీపీ జోరు!

ఫిబ్రవరి 16న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, నేడు మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి.

త్రిపురలో బీజేపీదే విజయం అని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ కూటమికి 36 నుంచి 45 స్థానాలు… లెఫ్ట్ కూటమికి 6 నుంచి 11 స్థానాలు…. తిప్రా మోథా పార్టీకి 9 నుంచి 16 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొన్నారు.

ఇక, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) విజయభేరి మోగిస్తుందని జీన్యూస్-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ వివరించాయి. ఎన్ పీపీకి 21 నుంచి 26 స్థానాలు… తృణమూల్ కాంగ్రెస్ కు 8 నుంచి 13 స్థానాలు… బీజేపీకి 6 నుంచి 11 స్థానాలు… కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 6 స్థానాలు, ఇతరులకు 10 నుంచి 19 స్థానాలు వస్తాయని వెల్లడించారు.

జీన్యూస్-మ్యాట్రిజ్ నాగాలాండ్ ఎగ్జిట్ పోల్స్ ను కూడా వెలువరించింది. నాగాలాండ్ లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ-ఎన్డీపీపీ కూటమికి 35 నుంచి 43 స్థానాలు…. కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 3 స్థానాలు… ఎన్ పీఎఫ్ కు 2 నుంచి 5 స్థానాలు వస్తాయని వివరించింది.

Related posts

యాదగిరి గుట్టపైకి వాహనంతో వెళ్లాలంటే రూ 500 పార్కింగ్ ఫీజు కట్టాలసిందే ….

Drukpadam

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు… ముగ్గురి మృతి

Drukpadam

శృంగారం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం …

Drukpadam

Leave a Comment