Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్ కి సిట్ నోటీసులు

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్ కి సిట్ నోటీసులు

  • టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం
  • తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్
  • ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలన్న సిట్
  • ఈ నెల 24న తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ అంశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్ బండి సంజయ్ ని కోరింది. ఇటీవల టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ కాగా, ఒకే ఊరిలో ఎక్కువమందికి 100 మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు.

సరిగ్గా, ఇలాంటి ఆరోపణలు చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ నెల 23న ఆధారాలతో సహా రావాలంటూ సిట్ రేవంత్ రెడ్డికి స్పష్టం చేసింది.

Related posts

పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. స్టూడియో ఊగిపోతున్నా వార్తలు చదవడం ఆపని యాంకర్.. !

Drukpadam

మళ్లీ ఎన్నికల నగారా మోగనున్నదా?

Drukpadam

అంబానీ నంబర్ 2.. అదానీ నంబర్ 1: ఫోర్బ్స్ తాజా లెక్కలు!

Drukpadam

Leave a Comment