Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నిన్న కాంగ్రెస్ లో చేరిక నేడు రాజీనామా..డి .శ్రీనివాస్ విషయంలో ట్విస్ట్!

నిన్న కాంగ్రెస్ లో చేరిక నేడు రాజీనామా..డి .శ్రీనివాస్ విషయంలో ట్విస్ట్!
-ఇంట్లో గొడవలే కారణమంటూ కథనాలు
-ఆయన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో ఒకే
-డి . యస్ భార్య విజయలక్ష్మి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ

డి .శ్రీనివాస్ రాజకీయ కురువృద్ధుడు … జగమెరిగిన బ్రాహ్మణుడు … కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు …రెండుసార్లు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన అధ్యక్షడు ఉన్నారు . రాజశేఖర్ రెడ్డి , డి శ్రీనివాస్ కాంబినేషన్ బాగా పనిచేసిందని అప్పట్లో ఏఐసీసీ నేతలు కితాబు నిచ్చారు . రాష్ట్ర విడిపోయిన తర్వాత డి .యస్ కొంతకాలానికి కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ యస్ లో చేరారు . ఆయనకు కేసీఆర్ రాజ్యసభ సీటు ఇచ్చారు . అయినప్పటికీ ఆయన టీఆర్ యస్ లో కంఫర్ట్ గా లేరనే అభిప్రాయాలే వ్యక్తం అయ్యాయి. చాలాకాలంగా ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వయసు పైపడినందున పెద్దగా తిరగలేకపోయిన కూర్చుని పార్టీకి సూచనలు , సలహాలు ఇస్తారని అనుకున్నారు . ఆ క్రమంలోనే ఆదివారం ఆయన పెద్ద కుమారుడు సంజయ్ ని వెంటబెట్టుకొని గాంధీ భవన్ కు వీల్ చైర్ లో వచ్చారు . ఆయనకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే తో పాటు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇతర నాయకులు స్వాగతం పలికారు . సంజయ్ తోపాటు ఆయనకు మెడలో కాంగ్రెస్ కండువా కప్పారు . తాను తిరిగి తన సొంతగూటికి చేరుకోవడం ఆనందంగా ఉందని డి . యస్ స్వయంగా చెప్పారు . ఏమైందో ఏమో కానీ 24 గంటలు తిరక్క ముందే ఆయన నిన్న చేరిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్య పరిచారు . ఈమేరకు ఆయన సతీమణి విజయలక్ష్మి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన చిన్న కుమారుడు అరవింద్ నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీ గా కొనసాగుతున్నారు . దీంతో ఇంట్లో గొడవలు వచ్చాయని ప్రచారం జరుగుతుంది . సంజయ్ విషయంలో అభ్యంతరం పెట్టని అరవింద్ తండ్రి కాంగ్రెస్ లో చేరికపై గరం గరం గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో తల్లి జోక్యం తో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు డి .యస్ ప్రకటించారు . దీన్ని భార్య విజయలక్ష్మి ధ్రువీకరించారు .

 

తాను కాంగ్రెస్ లో చేరలేదన్న డీఎస్… ఇదేం లొల్లి అంటూ వీహెచ్ అసహనం

  • నిన్న కుమారుడితో పాటు గాంధీభవన్ కు వచ్చిన డీఎస్
  • డీఎస్ కు కూడా పార్టీ కండువా కప్పిన కాంగ్రెస్ నేతలు
  • తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ ఖర్గేకు లేఖ రాసిన డీఎస్
  • రాహుల్ గాంధీ బాధలో మేముంటే ఈ పంచాయితీ ఏంటన్న వీహెచ్
VH comments on DS issue

సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) తనయుడు డి.సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తనయుడి వెంట డీఎస్ కూడా కాంగ్రెస్ లోకి వచ్చారని కథనాలు వచ్చాయి. దీనిపై డీఎస్ స్పందించారు. తాను కాంగ్రెస్ లో చేరినట్టు వస్తున్న వార్తలను ఖండించారు.

తన చిన్న కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడని, ఆ సందర్భంగా తనకు కూడా కండువా కప్పారని, కానీ తాను పార్టీలో చేరలేదని డీఎస్ స్పష్టం చేశారు. తాను పార్టీలో చేరినట్టు భావిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి డీఎస్ లేఖ రాశారు. ఆ లేఖలో తన భార్య విజయలక్ష్మిని సాక్షిగా పేర్కొన్నారు.

తన భర్త డీఎస్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని విజయలక్ష్మి వెల్లడించారు. ఆయన గతంలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేశారని, ఆయనను రాజకీయాల కోసం వాడుకోవద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు దయ ఉంచి ఇటువైపు రావొద్దని, తన భర్తను ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు. డీఎస్ ను తాము రమ్మని చెప్పలేదని, ఢిల్లీకి వెళ్లి ఆయనే పార్టీలో చేరుతున్నట్టు చెప్పాడని వెల్లడించారు. పార్టీలోకి వస్తానంటే మానవతా దృక్పథంతో ఆహ్వానించామని తెలిపారు. కానీ ఇప్పుడిలా మాట్లాడడం సరికాదని అన్నారు.

“మా ప్రాబ్లంలో మేముంటే ఇదేంది లొల్లి! పార్టీలో చేరడం లేదని డీఎస్ నిన్ననే చెబితే సరిపోయేది కదా! మీ కుటుంబంలో సమస్య ఉంటే మీరు మీరు మాట్లాడుకోవాలి. రాహల్ గాంధీ విషయంలో మేం బాధపడుతుంటే మధ్యలో మీ పంచాయితీ ఏంటి?” అని వీహెచ్ చిందులు తొక్కారు.

Related posts

రఘురామ రాజకీయం ……

Drukpadam

ఏపీతో జల వివాదం.. ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్!

Drukpadam

ఆస్తులు ఆదానికి …అప్పులు ప్రజలకు…బీజేపీ విధానాలపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం …

Drukpadam

Leave a Comment