Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పులివెందులలో కాల్పుల కలకలం…!

పులివెందులలో కాల్పుల కలకలం…!

  • కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి
  • కాల్పుల్లో గాయపడిన దిలీప్, మహబూబ్ బాషా
  • దిలీప్ పరిస్థితి విషమం
  • ఆర్థిక వివాదాలే కారణమని వెల్లడి

కడప జిల్లా పులివెందులలో ఓ ఘర్షణ సందర్భంగా తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో దిలీప్, మహబూబ్ బాషా అనే వ్యక్తులు గాయపడ్డారు. వీరిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో దిలీప్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దిలీప్ ను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

భరత్ కుమార్, దిలీప్ మధ్య ఆర్థిక వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో, ఇంటికి వెళ్లి తుపాకీ తీసుకువచ్చిన భరత కుమార్ యాదవ్ కాల్పులు జరిపాడు. కాగా, కాల్పుల్లో గాయపడిన మహబూబ్ బాషా మీడియాతో మాట్లాడుతూ, భరత్ కుమార్ యాదవ్ ఐదు రౌండ్లు కాల్చాడని వెల్లడించాడు.

కాగా, భరత్ కుమార్ యాదవ్ ను గతంలో వివేకా హత్యకేసులో సీబీఐ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

భరత్ కుమార్ యాదవ్ కాల్పుల్లో గాయపడ్డ దిలీప్ మృతి

Dileep dies of bullet wounds in Pulivendual firing incident

దిలీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో వేంపల్లె వద్ద మృతి చెందాడు. దాంతో అంబులెన్స్ సిబ్బంది అతడిని వేంపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. భరత్ కుమార్ యాదవ్ ఈ ఘటనలో లైసెన్స్ డ్ తుపాకీ ఉపయోగించినట్టు తెలిసింది. వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ కు భరత్ కుమార్ యాదవ్ బంధువేనని భావిస్తున్నారు. వివేకా హత్య కేసులో భరత్ కుమార్ యాదవ్ ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

కాగా, ప్రస్తుతం దిలీప్ మృతదేహం వేంపల్లె ఆసుపత్రిలోనే ఉంది. కాసేపట్లో పులివెందుల తరలించనున్నారు. అటు, కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్ ఘటన తర్వాత పరారయ్యాడు.

Related posts

అమెరికాలోని వాల్ మార్ట్ లో కాల్పులు.. 14 మంది మృతి!

Drukpadam

చిన్నారిపై నుంచి వెళ్లిన స్కూల్ బస్.. హైదరాబాద్ లో ఘోరం

Ram Narayana

ఒకేసారి విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురి మృతి…

Drukpadam

Leave a Comment