Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

డల్లాస్, డెన్వర్‌లలో కాల్పులు.. 8 మంది మృతి

  • గార్లాండ్‌లో ఓ దుకాణంలో కాల్పులు జరిపిన దుండగుడు
  • డెన్వర్‌లోని ఓ వాణిజ్య ప్రదేశంలో మరో ఘటన
  • మృతుల్లో పోలీసు అధికారి, ఇద్దరు మహిళలు

అమెరికాలో తుపాకి మళ్లీ గర్జించింది. డల్లాస్, డెన్వర్‌లలో జరిగిన కాల్పుల ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. డల్లాస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నగర శివారులోని గార్లాండ్ లో ఉన్న ఓ దుకాణంలోకి వచ్చిన దుండగుడు పికప్ ట్రక్‌లో బయటకువెళ్లి.. మళ్లీ వెంటనే తిరిగి వచ్చి కాల్పులు జరిపాడు. ఆ వెంటనే అదే ట్రక్‌లో పరారయ్యాడు.

డెన్వర్ సమీపంలో జరిగిన మరో ఘటనలో పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నగర సమీపంలోని ఓ వాణిజ్య ప్రదేశానికి కారులో వచ్చిన నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ సందర్భంగా పోలీసులు, నిందితుడికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Related posts

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రసాద్ పై కేసు నమోదు చేసిన పోలీసులు…

Ram Narayana

యూపీలో ఘోరం ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తిని డబ్బుకోసం చంపిన యజమాని !

Drukpadam

ఒడిశా లోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 వరకు మృతి ..!

Drukpadam

Leave a Comment