Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ పరిషత్ ఎన్నికలపై స్టే…

ఏపీ పరిషత్ ఎన్నికలపై స్టే…
-ఎల్లుండే ఎన్నికలు
-ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పిడుగుపాటు వార్తే
-రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలకు చెంపపెట్టు అంటున్న విపక్షాలు
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 8 న నిర్వవించనున్న జడ్పీటీసీ ,ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. కేవలం రెంరోజుల్లో ఎన్నికలు జరగనుండగా హైకోర్ట్ నిర్ణయం రాష్ట్ర సర్కార్కు పిడుగులాంటి వార్తే . ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానివి తొందరపాటు నిర్ణయాలేనని అందువల్ల ఇది ముమ్మాటికీ చెంపపెట్టె అని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. గత సంవత్సరకాలం పైగా ఎన్నికలపై రాష్ట్ర సర్కార్ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం తో విభేదించింది. గత ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై యుద్ధం తోనే సరిపోయింది. ఇప్పడు తిరిగి కోర్ట్ తీర్పు కచ్చితంగా ఇబ్బందికరంగా మారె పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పరిషత్ ఎన్నికలను బై కట్ చేసింది. హైకోర్టు తెలుగుదేశం వేసిన పిటిషన్ మీదనే ఎన్నికలపై స్టే విధించింది. దీనితో ఎన్నికలు జరగటం సందిగ్ధంగా మారింది.ఇప్పడు ఏమిచేయాలనే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం తల పట్టుకుంది . సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ముందు 4 వరాల సమయం ఉండటంతో పాటు ఎన్నికల కోడ్ అమలు జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఈ నెల 15 లోపల కౌంటర్ దాఖలు చేయాలనీ కోర్ట్ ఆదేశించింది . విపక్షాలు ఎన్నికల ప్రక్రియను మొత్తం రద్దుచేయాలని కోరాయి . నోటిఫికేషన్ పోలింగ్ కు ముందు 4 వారలు కచ్చితంగా ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికలలో పాల్గొనే విషయంలో పునరాలోచించాలని సిపిఐ కార్యదర్శి నారాయణ విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలు దిక్కరించినట్లే నని అందువల్ల ఎన్నికల సంఘం తిరిగి అన్నిరాజకీయ పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని వత్తిడి పెరుగుతుంది. సింగిల్ జడ్జి ఈ తీర్పు ఇవ్వడంపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో చూడాలి మరి !!!

Related posts

నాడు ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది : చంద్ర‌బాబు!

Drukpadam

క్షీణించిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం.. ఎయిమ్స్ కు త‌ర‌లింపు

Drukpadam

ఇంగ్లండ్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఎమర్జెన్సీ ప్రకటన!

Drukpadam

Leave a Comment