Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పోలికలేని ముడుసింహలు …కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శ ….

అశోక స్తూపంపై ఉన్న మూడు సింహాలకు, పార్లమెంటు భవనంపై ఉన్న మూడు సింహాల గుర్తుకు పోలికే లేదు: జైరాం రమేశ్

  • నూతన పార్లమెంటు భవనంపై మూడు సింహాల గుర్తు
  • జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మోదీ
  • జాతీయ చిహ్నానికి దారుణ అవమానమన్న జైరాం రమేశ్
Congress leaders questions Modi about new three lions on parliament building

నూతన పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నమైన మూడు సింహాల గుర్తును ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నూతన మూడు సింహాల చిహ్నం సారనాథ్ లోని అశోకస్తూపంపై ఉన్న మూడు సింహాల గుర్తుతో ఏ మాత్రం పోలిక లేకుండా ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. సారనాథ్ లోని అశోకస్తూపంపై ఉన్న సింహాల స్ఫూర్తిని నూతన జాతీయ చిహ్నం కొంచెం కూడా ప్రతిబింబించేలా లేదని, పూర్తిగా విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. జాతీయ చిహ్నానికి ఇది దారుణ అవమానం అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

లోక్ సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి కూడా దీనిపై విమర్శలు చేశారు. “నరేంద్ర మోదీ గారూ ఓసారి ఆ సింహం ముఖం చూడండి. సారనాథ్ లోని మహోన్నత స్తూపంపై ఉన్న సింహానికి ప్రతినిధిలా ఉందా? లేకపోతే గిర్ అడవుల్లో తిరిగే సింహం ముఖాన్ని వక్రీకరించినట్టు ఉందా?” అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

Related posts

మంద కృష్ణ మాదిగ ధర్మయుద్ధానికి ప్రధాని మోడీ హామీ…!

Ram Narayana

 ముంబైని అతలాకుతలం చేసిన వాన.. థానేలో విరిగిపడిన కొండచరియలు!

Ram Narayana

ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్… 11 మంది నక్సల్స్ మృతి

Ram Narayana

Leave a Comment