Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలు సహా 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు!

ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలు సహా 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు!
-నిరసనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
-నిన్న లోక్ సభలో నలుగరు కాంగ్రెస్ సభ్యులపై వేటు
-నేడు రాజ్యసభలో విపక్షాల నిరసనలు
-సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ వేటు

ధరల పెరుగుదల,పెదమధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులపై జిఎస్టి వసూల్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వర్షాకాలసమావేశాలు అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్షాలు ధరవరులపై ప్రజలపై పడుతున్న భావరాలపై చర్చించాలని పట్టుపడితే పట్టించుకోని కేంద్రం అడుగుతున్న సభ్యులను సభనుంచి గెంటి వేస్తుందని సస్పెండ్ కు గురైన సభ్యులు మండిపడుతున్నారు .

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. నిన్న లోక్ సభ నుంచి నలుగురు కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్ కు గురికాగా, నేడు 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని, బిగ్గరగా నినాదాలు చేస్తున్నారని వారిపై ఈ వారాంతం వరకు వేటు వేశారు. సస్పెండైన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు లింగయ్య యాదవ్, రవీంద్ర వద్దిరాజు, దీవకొండ దామోదర్ రావు కూడా ఉన్నారు.

సస్పెండైన ఇతర ఎంపీలు వీరే…

సుస్మితా దేవ్- తృణమూల్
డాక్టర్ శంతను సేన్- తృణమూల్
మౌసమ్ నూర్- తృణమూల్
శాంతా చెత్రి- తృణమూల్
డోలా సేన్- తృణమూల్
అభిర్ రంజన్ దాస్- తృణమూల్
నదిముల్ హక్- తృణమూల్
కనిమొళి- డీఎంకే
హమీద్ అబ్దుల్లా- డీఎంకే
గిర్ రంజన్- డీఎంకే
ఎన్నార్ ఎలాంగో- డీఎంకే
ఎస్. కల్యాణసుందరమ్- డీఎంకే
ఎం.షణ్ముగం- డీఎంకే
ఏ.ఏ. రహీమ్- సీపీఎం
డాక్టర్ వి.శివదాసన్- సీపీఎం
పి.సంతోష్ కుమార్- సీపీఐ

Related posts

కేసీఆర్ తో భేటీపై ఉండవల్లి …

Drukpadam

ప్రధాని కంట కన్నీరు

Drukpadam

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఊహించని షాక్.. దిమ్మతిరిగే ప్రకటన చేసిన ఎన్సీపీ!

Drukpadam

Leave a Comment