Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణాలో మే 1 ఉదయం వరకు రాత్రిపూట కర్ఫ్యూ

తెలంగాణాలో మే 1 ఉదయం వరకు రాత్రిపూట కర్ఫ్యూ
– రాత్రి పూట 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు
-కేసులు పెరుగుతున్న దృష్ట్యా సర్కార్ నిర్ణయం
-అత్యవసర సేవలకు మినహాయింపు
-ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ ల నుంచి వచ్చే ప్రయాణికులు టిక్కెట్లు చూపించాలి
-నిభందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే
-జిల్లా కలెక్టర్లకు , ఎస్పీ లకు ఆదేశాలు

కరోనా మహమ్మారి విజృభిస్తున్న వేళ హైకోర్టు మొట్టికాయలతో తెలంగాణ అప్రమత్తం అయింది . మే 1 వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసించి . రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ప్రకటించింది . దేశంలో గత రెండు మూడు వారాలుగా కరోనా మహమ్మారి విజృభిస్తుంది. తెలంగాణాలో కూడా దాని ప్రభావం ఉండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు అములు చేయాలనీ నిర్ణయించుకుంది. ఇటీవల కాలంలో తెలంగాణాలో కేసులు సంఖ్య బాగాపెరిగింది . రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇది తక్షమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాపారులు తమ షాప్ లను రాత్రి 8 గంటలవరకు మూసివేయాల్సి ఉంటుంది. అయితే అత్యవసర సేవల కేటగిరిలో మీడియా , ఈ కామర్స్ ,డెలివరీ , ఇంటర్నెట్ ,కేబుల్ ,పెట్రోల్ పుంపులు , గ్యాస్ స్టేషన్లు , విద్యుత్ , నీరు, కోల్డ్ స్టోరేజీలు , వెర్ హోసింగ్ , ప్రవేట్ సెక్యూరిటీ , ఉత్పత్తికు సంబందించిన అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నది . వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.సిబ్బందికి తగిన గుర్తింపు కార్డులు ఉండాలి . పేషంట్లు ,గర్భిణీ స్త్రీలు , ,విమాన ప్రయాణం చేసేవారు. రైల్వే , బస్టాండ్ లనుంచి వచ్చే వారు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాపితంగా వెంటనే కర్ఫ్యూ అమలు చేసేందుకు జిల్లాల కలెక్టర్లు , సూపరెండెంట్ ఆఫ్ పోలీసులు లకు అధికారాలు ఇచ్చారు. ప్రభుత్వ నిభందనలు ఉల్లఘించినవారిపై డిసాస్టర్ మేనేజ్ మెంట్ సెక్షన్ లు 51 నుంచి 60 , మరియు ఇండియన్ పీనల్ కోడ్ 188 ప్రకారం శిక్షార్హులు అవుతారని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నిభందనలు మే 1 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలంగాణ సర్కార్ తెలిపింది.
కేంద్రప్రభుత్వం మరో ఉత్తర్వులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50 తగ్గకుండా కార్యాలయాలకు హాజరు కావాలని పేర్కొన్నది . డిప్యూటీ సెక్రటరీ స్థాయి ఉద్యోగులు మాత్రం ప్రతిరోజూ హాజరు కావాల్సిందే . .

Related posts

కరోనాకు మరో కొత్త టీకా.. నాలుగు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామన్న గ్లాక్సో…

Drukpadam

ఏపీ అభ్యర్థనకు కేంద్రం నో.. 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేయాల్సిందేనని స్పష్టీకరణ

Drukpadam

ఒమిక్రాన్ కథ ముగిసినట్టే.. బ్రిటన్, అమెరికాలో పీక్ కు చేరిన కేసులు..

Drukpadam

Leave a Comment