Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ సీనియర్ నేత ఎం సత్యనారాయణరావు కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్‌ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడ పని చేశారు. ఎం. సత్యనారాయణరావు (ఎంఎస్‌ఆర్‌) కన్నుమూశారు . కొవిడ్‌ లక్షణాలతో నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఉమ్మడి ఏపీలో ఆర్టీసీ చైర్మన్‌గా ఎంఎస్‌ఆర్‌ చేశారు. ఆయన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ శాఖా మంత్రి విధులు నిర్వహించారు. ఎం ఎస్ ఆర్ గా పిలవబడే ఆయన వివాదాలకు దూరంగా ఉండేవారు. మూడుసార్లు కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. 5 వ లోకసభకు తెలంగాణ ప్రజాసమిత నుంచి గెలుపొందిన ఆయన అనంతరం కాంగ్రెస్ లో చేరి 6,7 లోకసభలలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఎంఎస్‌ఆర్ మృతిపై కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Related posts

పెళ్లిపీటలపైనే వధువుపై చేయి చేసుకున్న వరుడు.. వెళ్లిపోయిన పెళ్లి కుమార్తె!

Drukpadam

ప్రజాధనంతో ఉచితాలిచ్చే రాజకీయపార్టీలు రద్దు చేయాలి సుప్రీం లో పిటిషన్ !

Drukpadam

నేపాల్ ప్రభుత్వ తీరుతో లక్షలాది రూపాయల పరిహారాన్ని కోల్పోబోతున్న విమాన ప్రమాద మృతుల కుటుంబాలు!

Drukpadam

Leave a Comment