Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

  • కరోనా బారినపడుతున్న రాజకీయ నేతలు
  • తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న పువ్వాడ
  • ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా నిర్ధారణ
  • పూర్తిగా హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు పువ్వాడ వెల్లడి

తొలి దశతో పోల్చి తే కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య అధికంగా నమోదవుతోంది. తాజాగా, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలతో బాధపడుతుండడంతో ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు.

దీనిపై మంత్రి పువ్వాడ ట్విట్టర్ లో స్పందించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం పూర్తిగా హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related posts

ఖమ్మం ప్రెస్‌క్లబ్ అధ్యక్షులుగా మైసా పాపారావు!

Drukpadam

ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక బదిలీ!

Drukpadam

ఇదొక అద్భుత ఆలయం…135 ఏళ్ళ చరిత్ర గోడలకు నోట్ల కట్టలు…

Drukpadam

Leave a Comment