కరోనా వృద్ధిని అడ్డుకునేందుకు 2డీజీ ఔషధం విడుదల చేసిన కేంద్రమంత్రులు…
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ డీ ఆర్ డీ ఓ అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం
క్లినికల్ ట్రయల్స్ లో పరీక్షలు నిర్వహించిన తరువాత విడుదల చేసిన మంత్రులు
కరోనా భారిన పది చికిత్స తీసుకుంటున్నవారికి అదనంగా ఇదే ఇస్తే త్వరగా కోలుకుంటారు .
కరోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2-డియాక్సీ డి-గ్లూకోజ్) అందుబాటులోకి వచ్చింది. ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్, హర్షవర్ధన్ విడుదల చేశారు. మొదట రక్షణ మంత్రి డ్రగ్ను విడుదల చేసి ఆరోగ్యశాఖ మంత్రికి అందజేయగా.. డ్రగ్స్ను ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు అందజేశారు. పదివేల డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పౌడర్ను డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరి సహకారంతో అభివృద్ధి చేసింది. 2డీజీ డ్రగ్ను కరోనా రోగులకు అత్యవసర వినియోగానికి ఇటీవల డీసీజీఐ అనుమతి ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలిందని డీఆర్డీఓ పేర్కొంది. కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ డ్రగ్ను ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని వివరించింది.
previous post