Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రానున్న ఎన్నికలలో తుమ్మలా? తనయుడా ?

రానున్న ఎన్నికలలో తుమ్మలా? తనయుడా ?
సీనియర్ రాజకీయ నాయకుడు తుమ్మల ……… వచ్చే ఎన్నికలలో పోటీచేస్తారా ? లేక ఆయన తనయుడు యుగంధర్ పోటీచేస్తాడా ?అనే చేర్చ నేడు ఖమ్మం జిల్లాలో నడుస్తుంది . తుమ్మల రాజకీయాలలో ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు . మరి కొన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసే సత్తా ఆయనుకు ఉంది . ఇటీవల ఆయన ఉరుకులు పరుగులు పెడుతున్నారు . గతంలో ఆయన నియోజక వర్గంలో అప్పుడప్పుడు మాత్రమే కనిపించేవారు . ఇప్పుడు తాను పోటీచేసి ఓడిపోయినా పాలేరు తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు . జనవరి మొదటి తేదీన గండుగులపల్లి లోని ఆయన స్వగృహానికి అభిమానులు పోటెత్తారు . ప్రత్యేకించి పాలేరునుంచి వేలాది మంది వచ్చి ఆయన్ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు . ఆయన దగ్గరికి వచ్చిన అందరిని ఆయన పేరుపేరునా పలకరించారు . ఈ సందర్భంగా జై తుమ్మల అంటూ నినాదాలు కూడా చేయటం విశేషం . దీంతో ఇప్పటి వరకు ఆయన ఈసారి పోటీ చేయరని వస్తున్నా ఊహాగానాలకు పటాపంచలు అయ్యాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . ఆయనకు అత్యంత సన్నిహితులు ఆయనే ఈసారికూడా పోటీచేస్తారని అంటున్నారు . పాలేరులో ప్రజలు కూడా తుమ్మల ఉన్నప్పుడు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఇప్పుడు ఏమాత్రం అభివృద్ధి లేదని వాపోతున్నారు . గత ఎన్నికలలో ఓట్లు వేయని వారు సైతం తుమ్మల విషయంలో పొరపాటు చేశామని పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నారు . ఎన్నికలలో తుమ్మల ఓడిపోయిన తరువాత ఆయన తనయుడు యుగంధర్ నియోజకవర్గ ప్రజలతో నిత్యం సంభందాలు కొనసాగిస్తున్నారు . వారికీ ఏసమస్య వచ్చిన దాన్ని అడ్రస్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు . ఏచిన్న కార్యక్రమం అయినా యుగంధర్ ప్రత్యక్షం అవుతున్నారు . టీ ఆర్ యస్ లో ఆయనకు ప్రాముఖ్యత తగ్గిందా అనే అనుమానాలు ఉన్నాయి . కెసిఆర్ ఆయనకు సన్నిహిత సంభందాలు ఉన్నందునే ఆపార్టీలో చేరారు . కెసిఆర్ కూడా జిల్లా నుంచి తుమ్మలకు ప్రాధాన్యత ఇచ్చి తన మంత్రి వర్గంలో చేర్చు కొని ఎమ్మెల్సీని చేశారు . తరువాత పాలేరు ఉపఎన్నికలలో అక్కడ పోటీచేయించారు . కెసిఆర్ మంత్రి వర్గంలో మంత్రిగా , అంతకు ముందు తెలుగుదేశంలో మంత్రిగా జిల్లా రాజకీయాలను తన కనుసైగలతో చక్రం తిప్పిన తుమ్మల నాగేశ్వరావు ప్రస్తుతం తాను ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా తాను అధికారానికి దూరంగా ఉన్నారు . దీంతో అందరి చూపు తుమ్మల వైపే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయనకు అనుయాయులు ఉన్నారు . ఆయన బీజేపీలో చేరనున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై దీటుగానే ఆయన స్పందించారు . తనపై నిందారోపణలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయనే స్వయంగా పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు . కారణాలు సరిగా విశ్లేషించుకోకుండా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు . ప్రస్తుతం ఆయన తన స్వగ్రామమైన గండుగులపల్లి లో వ్యవసాయం చేసుకుంటూ తన అనుయాయులు అభిమానులను తరుచు కలుస్తున్నారు . టీ ఆర్ యస్ లోనే ఉంటున్నప్పటికీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు . అప్పుడప్పుడు తుమ్మలకు తిరిగి మంత్రి పదవి వస్తుందని కేసీఆర్ స్వయంగా తుమ్మలను పిలిచారని , సోషల్ మీడియా లోను ప్రచార మాద్యమాలలోను వార్తులు విపరీతంగా వచ్చాయి వాటిని ఆయన ఖండించలేదు . పార్టీలోనూ , అధికారంలోను ఆయనకు ప్రాధాన్యత లేకపోటంపై ఆయన అభిమానులలో తీవ్ర అసంతృప్తి ఉంది . రాష్ట్రంలో రాజకీయాల్లో వస్తున్నా మార్పులు మరోమారు తుమ్మల రాజకీయ అడుగులపై , ఆయన భవిషత్తు పై చర్చకు దారితీస్తున్నాయి . ఆయన రాజకీయ అడుగులు ఏవిధంగా ఉంటాయి . ఈ సారి తాను కాకుండా తనయుడు యుగంధర్ బరిలో దించే ఆలోచన చేస్తారా లేదా తానే పోటీ చేస్తారా ? అనేది ఆశక్తి కరంగా మారింది ……

Related posts

మోదీ బాధ నిజ‌మే అయితే బీరేన్ సింగ్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసి ఉండేవారు: మ‌ల్లికార్జున ఖ‌ర్గే..

Drukpadam

దేశాన్ని ప్రేమిస్తా.. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తా.. : కేజ్రీవాల్

Drukpadam

రేణిగుంట చేరుకున్న అమిత్ షా… స్వయంగా స్వాగతం పలికిన సీఎం జగన్!

Drukpadam

Leave a Comment