Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Date of Publish : 09 November 2023
Digital Edition : Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

గీత దాటితే వేటు తప్పదు … కామారెడ్డి నేతలకు కేసీఆర్ వార్నింగ్ …

 పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు: కేసీఆ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గజ్వేల్ లో ఉదయం నామినేషన్ వేసిన కేసీఆర్… అక్కడి నుంచి కామారెడ్డికి చేరుకున్నారు. కామారెడ్డిలో నేరుగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటికి వెళ్లారు. అక్కడ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. కామారెడ్డిలో ఇటీవల చోటుచేసుకున్న వివాదాలపై ఆయన ఆరా తీశారు. గ్రూపు తగాదాలను వీడాలని, అందరూ కలసికట్టుగా పని చేయాలని సూచించారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లొద్దని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.