Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రశాంత్ కిశోర్ ఐ-ప్యాక్ సభ్యుల్ని గృహ నిర్బంధం చేసిన త్రిపుర పోలీసులు!

ప్రశాంత్ కిశోర్ ఐ-ప్యాక్ సభ్యుల్ని గృహ నిర్బంధం చేసిన త్రిపుర పోలీసులు
-వారం నుంచి త్రిపురలో మకాం వేసిన ఐ-ప్యాక్ సభ్యులు
-వారి కదలికలు అనుమానంగా వున్నాయన్న పోలీసులు
-ప్రజాస్వామ్యంపై దాడేనన్న టీఎంసీ
-సర్వే చేయడం తప్పు రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్న

సర్వే లు చేయడం సర్వసాధారణం …. ఎన్నికలకు ముందు తమ పరిస్థితులను అంచనా వేసుకుందుకు వివిధ సంస్థలు సర్వేలు చేస్తుంటాయి. .. ఇది కొత్తగా వచ్చిన సిస్టం కాదు …రాజ్యాంగ వ్యతిరేకమైంది అసలే కాదు . పద్దతి ప్రకారం ప్రజలు ఆలోచనలు తెలుసుకుండేందుకు చేస్తున్న సర్వేను అడ్డుకోవడం , వారిని నిర్బందించడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగా టీఎంసీ అభివర్ణించింది. ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు త్రిపురలో సర్వే చేస్తున్నారు. అది టీఎంసీ కి ఉన్న అవకాశాలను అంచనా వేస్తున్నారు. ఇది నచ్చని అక్కడ బీజేపీ సర్కార్ సర్వే చేస్తున్న సభ్యులను బయటకు రాకుండా నిర్బంధించింది. ఇదేమని ప్రశ్నిస్తే అసలే కరోనా మహమ్మారి ఉంది. ఎలా కొత్త వాళ్ళ బయట తిరగటం కుదరదని చెబుతుంది.

త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్‌కు ఉన్న రాజకీయ అవకాశాలను అంచనా వేసేందుకు వారం రోజుల క్రితం రాజధాని అగర్తలకు వచ్చి, ఓ హోటల్‌లో బస చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఐ-ప్యాక్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 22 మంది సభ్యులున్న ఈ బృందం వివిధ చోట్ల పర్యటిస్తూ సర్వే చేస్తోంది. అయితే, వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని నిర్బంధించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అందరూ హోటల్ రూములోనే ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించినట్టు పశ్చిమ త్రిపుర ఎస్పీ మాణిక్ దాస్ తెలిపారు.

మరోపక్క, ఐ-ప్యాక్ సభ్యుల్ని నిర్బంధించిన విషయం తెలిసిన టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి తప్ప మరోటి కాదని మండిపడింది. ఇది బీజేపీ పనేనని ఆరోపించింది. రాష్ట్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజలు విసిగిపోయారని, అందుకనే తమకు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొంది. వారు తమకు మద్దతుగా నిలుస్తుండడం చూసి తట్టుకోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశిష్‌లాల్ సింఘా ఆరోపించారు.

Related posts

బెంగాల్‌ ప్రచారపర్వంలోకి జయాబచ్చన్…టీఎంసీ కి మద్దతు

Drukpadam

త‌ణుకులో హైటెన్ష‌న్‌!… అమ‌రావ‌తి రైతుల యాత్ర‌కు వైసీపీ శ్రేణుల నిర‌స‌న‌!

Drukpadam

మోదీని ఓడించ‌డం పిల్ల‌ల ఆట కాదు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే!

Drukpadam

Leave a Comment