Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

మళ్లీ కరోనా కలకలం… ఏపీ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక!

మళ్లీ కరోనా కలకలం… ఏపీ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక!
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి
10 శాతాన్ని మించిన పాజిటివిటీ రేటు
తక్షణమే చర్యలు తీసుకోవాలన్న కేంద్రం
వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని స్పష్టీకరణ
వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే తెలంగాణ హైకోర్టు లోకి అనుమతి

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఊపందుకోవడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, అసోం, మిజోరం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో కరోనా కేసుల పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ 10 రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటిందని, మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్యన ఉందని వివరించింది. ఈ జిల్లాల్లో ఏమాత్రం అలసత్వం చూపించినా పరిస్థితి దారుణంగా మారుతుందని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాలు తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కంటైన్మెంట్ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయడమే కాకుండా, 60 ఏళ్లకు పైబడినవారికి, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగినవారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా వ్యవస్థలపై నియంత్రణ, జన సమూహాలను నిరోధించడం తప్పనిసరి అని పేర్కొంది.

వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే తెలంగాణ హైకోర్టు లోకి అనుమతి

 

కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణలో పాల్గొనేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. న్యాయవాదులు, ఇతర న్యాయ సిబ్బంది కరోనా నియామవళి తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని కోర్టులు, ట్రైబ్యునళ్లకు తెలంగాణ హైకోర్టు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

ఆగస్టు 9 నుంచి పలు కేసుల ప్రత్యక్ష విచారణ చేపడుతున్నట్టు వెల్లడించింది. అయితే ఇది పాక్షికమేనని, సెప్టెంబరు 9 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. అది కూడా రోజుకొక ధర్మాసనం, ఇక సింగిల్ బెంచ్ కు ప్రత్యక్ష విచారణ అవకాశం కల్పిస్తామని హైకోర్టు తెలిపింది. ఆగస్టు 8 వరకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కోర్టుల్లో ఆన్ లైన్ లో విచారణ ఉంటుందని వివరించింది.

 

Related posts

కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు కేంద్రం చేయూత…

Drukpadam

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ విజృంభణ… ఉచితంగా చికిత్స ప్రభుత్వ నిర్ణయం

Drukpadam

కోవిడ్ అడుగు పెట్టని దేశాలు ఇవి..!

Drukpadam

Leave a Comment