Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది చర్యలపై వినూత్న నిరసన ఒంగి నమస్కారాలు!

జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది చర్యలపై వినూత్న నిరసన ఒంగి నమస్కారాలు!
-అధికారుల తీరుపై తీవ్ర నిరసన 
-సమావేశానికి గైర్హాజరైన మునిసిపల్ సిబ్బంది
-అదే సమయంలో ఎమ్మెల్యే నిర్వహించిన ర్యాలీకి హాజరైన సిబ్బంది
-కమిషనర్ వచ్చే వరకు కదిలేది లేదంటూ రాత్రంతా కార్యాలయంలోనే
-26 మంది సిబ్బంది కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు

జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చెర్మన్ …. ఆయన ఏది చేసిన సంచలనమే …. రాష్ట్రంలో నే టీడీపీ గెలిచిన మున్సిపాల్టీగా చరిత్ర సృష్టించిన జేసీ ప్రభాకర్ రెడ్డి , జగన్ దయవల్లనే తాను మున్సిపల్ చైర్మన్ అయ్యానని ఆయన తలుచుకుంటే అయ్యేవాడిని కాదని అన్నారు. ఇప్పుడు ఆయన కు మున్సిపల్ సిబ్బంది సహకరించడంలేదు .దీంతో ఆయన వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వాళ్ళు వచ్చే వరకు మున్సిపల్ కార్యాలయంలో ఉంటానని అక్కడే రాత్రిపూట నిద్రపోయారు. వారు వచ్చిన తరువాత వారికీ వంగివంగి నమస్కారాలు పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది…..

మునిసిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. నిన్న ఉదయం పదిన్నర గంటలకు మునిసిపల్ చైర్మన్ హోదాలో సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని శనివారమే అందరికీ తెలియజేశారు. అయితే, అదే సమయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మునిసిపల్ సిబ్బందితో కరోనా వైరస్ మూడో దశపై అవగాహన ర్యాలీ, సమీక్ష సమావేశం నిర్వహించడంతో వారందరూ దానికి హాజరయ్యారు. అయితే, ర్యాలీ అనంతరం సమావేశానికి వస్తారని భావించిన జేసీ 12.30 గంటల వరకు కౌన్సిలర్లతో కలిసి కార్యాలయంలో ఎదురుచూస్తూ కూర్చున్నారు.

అయితే, ర్యాలీ అనంతరం సిబ్బంది ఇళ్లకు వెళ్లిపోయారు. కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి మధ్యాహ్నం సెలవుపై వెళ్తూ ఇతరులకు బాధ్యతలు అప్పగించారు. విషయం తెలిసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారులు కార్యాలయాలకు వచ్చే వరకు వెళ్లేది లేదంటూ తన చాంబర్‌లోనే ఉండిపోయారు. చివరికి నాలుగున్నర గంటలకు అధికారులు రాగానే జేసీ లేచి వారికి ఒంగిఒంగి దండాలు పెట్టారు. అంతేకాదు, తనకు సమాచారం ఇవ్వకుండా కమిషనర్ ఎలా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, తన ఆదేశాలను బేఖాతరు చేసిన 26 మంది సిబ్బందికి నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కమిషనర్ వచ్చే వరకు కార్యాలయంలో ఉంటానని చెప్పిన ఆయన.. రాత్రి భోజనం చేసి అక్కడే నిద్రపోయారు. అంతకుముందు ఆయన మునిసిపల్ సిబ్బంది 26 మంది కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts

చంద్రబాబుకు ఆపార శక్తిసామర్థ్యాలు…మకాం ఢిల్లీకి మార్చాలని కెవిపి సలహా..!

Drukpadam

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ ఆరోపణ!

Drukpadam

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమన్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన హరీశ్ రావు

Drukpadam

Leave a Comment