Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చిత్తూరు జిల్లాలో దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన‌ పోలీసులు..

చిత్తూరు జిల్లాలో దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన‌ పోలీసులు..
-రోడ్డు ప‌క్క‌న వస్త్ర దుకాణంలో ఘ‌ట‌న‌
-సీసీ కెమెరా ద్వారా గుర్తించిన య‌జ‌మాని
-పోలీసుల‌పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు

కంచె చేను మేసిన చందంగా …. దొంగతనాలను అరికట్టాలిసిన పోలీసులే దొంగతనాలకు పాల్పడితే ఎవరికీ చెప్పుకోవాలి … కానీ ఇది జరిగింది … పోలీసులే దొంగతనం చేసిన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఆరురోజుల తరువాత ఈ విషయం వెలుగు చూసింది. ఒక ఏ ఎస్ ఐ ,కానిస్టేబుల్ కలిసి చేసిన దొంగతనం సీసీ కెమెరాల్లో దొరికిపోయింది. దీంతో అవాక్కు అయిన ఆ శాఖా ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్న దీన్ని బయటకు రాకుండా ఉండే ప్రయత్నం చేశారు. కానీ ఆగుతుందా ? ఆ నోటా ఈ నోటా పడింది. చివరకు మీడియా వారికీ చేరింది. వెంటనే న్యూస్ ఫ్లాష్ అయింది. దీనిపై పోలీస్ శాఖా తలలు పట్టుకుంటుంది. విషయం ఏమిటంటే ….

రాత్రి పూట దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌కుండా చూసేందుకు పోలీసులు వాహ‌నాల్లో గ‌స్తీ తిరుగుతుంటారు. చోరీలు, నేరాలు జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌డ‌మే వారి విధి. అయితే, చోరీలు జ‌ర‌గకుండా చూడాల్సిన పోలీసులే.. దొంగ‌త‌నాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాకు చిక్కాయి.

ఓ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ రాత్రి స‌మ‌యంలో రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న బట్టల దుకాణంలో చోరీ చేశారు. ఇద్దరు పోలీసులు దుకాణం వ‌ద్దే స్కూటర్ ఆపి, ఫుట్‌పాత్‌పై ఉండే వస్త్ర దుకాణంలోకి వెళ్లి దుస్తులు తీసుకుని వెళ్లిపోయారు.

చోరీ జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా ద్వారా ఈ విష‌యం బయట పడింది. పోలీసుల‌పై దుకాణ‌ యజమాని పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. దుస్తులు చోరీ చేసింది ఏఆర్ కానిస్టేబుల్ అని, అత‌డికి సాయం చేసిన‌ మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని అధికారులు నిర్ధారించారు. అయితే, ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. చివ‌ర‌కు మీడియాకు ఈ సీసీ దృశ్యాలు చిక్క‌డంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Related posts

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై …అధరాలు దొరక్కుండా నోట్లు మింగే ప్రయత్నం …

Drukpadam

మీడియా సంస్థ‌లు, జ‌ర్న‌లిస్టుల‌పై పరువు నష్టం దావా వేసిన హీరోయిన్ శిల్పాశెట్టి…

Drukpadam

వేశ్యల పాలిట యముడు… 14 మంది దారుణ హత్య

Ram Narayana

Leave a Comment