Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్​ సీఎం పదవి ఆఫర్​ ను తిరస్కరించిన కాంగ్రెస్​ సీనియర్​ మహిళా నేత.. సీఎం రేసులో సిద్ధూ!

పంజాబ్​ సీఎం పదవి ఆఫర్​ ను తిరస్కరించిన కాంగ్రెస్​ సీనియర్​ మహిళా నేత.. సీఎం రేసులో సిద్ధూ!
-రాహుల్ తో నిన్న అర్ధరాత్రి సమావేశం
-సిక్కులకు అవకాశం ఇవ్వాలని సూచన
-ఎమ్మెల్యేలతో రాజకీయ పరిశీలకుల సమావేశాలు
-ఈ రోజు సాయంత్రానికి సీఎం అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్

పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత, గాంధీలకు విధేయురాలైన అంబికా సోని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. నిన్న అర్ధరాత్రి ఆమెతో రాహుల్ గాంధీ సమావేశమైనట్టు తెలుస్తోంది. సమావేశంలో భాగంగా అంబికకు రాహుల్ సీఎం పదవిని ఆఫర్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సిక్కులే ఉండాలని, లేదంటే దాని వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె చెప్పినట్టు సమాచారం. పంజాబ్ హోషియార్ పూర్ జిల్లాకు చెందిన అంబికా సోని.. పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1969లో ఇందిరాగాంధీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.

పార్టీలో తాను అడుగడుగునా అవమానాలే ఎదుర్కొన్నానని పేర్కొంటూ నిన్న అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరితోనూ నిన్ననే సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అదికాకుండా ఇవాళ ఒక్కో ఎమ్మెల్యేతో పార్టీ ముగ్గురు రాజకీయ పరిశీలకులు సమావేశమవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం నాటికి పంజాబ్ సీఎం పేరు ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధిపతులు సునీల్ జఖార్, ప్రతాప్ సింగ్ బాజ్వా, బియాంత్ సింగ్ మనవడు రవ్నీత్ సింగ్ బిట్టుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారితో పాటు పంజాబ్ పీసీసీ ప్రస్తుత చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ, సుఖ్జీందర్ సింగ్ రంధావా, త్రుప్త్ రాజీందర్ సింగ్ బాజ్వా, బ్రహ్మ్ మహీంద్ర, విజయ్ ఇందర్ సింగ్ల, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రాలూ రేసులో ఉన్నారని తెలుస్తోంది.

పంజాబ్​ లో సీఎం మార్పు.. శశిథరూర్​ లాగానే ఓ ‘కొత్త పదం’తో తన అభిప్రాయం చెప్పిన కాంగ్రెస్​ సీనియర్​ కపిల్​ సిబల్
ఉత్తరాఖండ్, గుజరాత్, పంజాబ్ పరిణామాలపై కామెంట్స్
‘ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్’ అంటూ ట్వీట్
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న అర్థం

ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పులు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని మార్చారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ లో విజయ్ రూపానీ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. తాజాగా పంజాబ్ లో పార్టీ అధిష్ఠానం ఒత్తిళ్లతో అమరీందర్ తప్పుకొన్నారు.

ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తనదైన శైలిలో స్పందించారు. పార్టీలో పరిణామాలపై అసంతృప్తితో ఉన్న ‘జీ23’ వర్గం గురించి గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన ఆయన వార్తల్లో నిలిచారు. పార్టీలో నిర్మాణాత్మక మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. తాజాగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శశిథరూర్ ఎప్పుడూ కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలతో ఆకట్టుకుంటే.. ఇప్పుడు సిబల్ కూడా ఓ కొత్త పదంతో తన అభిప్రాయం చెప్పారు.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ‘‘అధికార మార్పులు. మొన్న ఉత్తరాఖండ్, నిన్న గుజరాత్.. ఇప్పుడు పంజాబ్. పాత సామెత చెప్పినట్టు.. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ (ఎ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్). కాదంటారా?’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ అంటే.. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించాలని, పెద్దగా అయ్యేదాకా ఎదురుచూడకూడదని అర్థం.

 

Related posts

మోదీ హత్యకు కాంగ్రెస్ కుట్ర.. పంజాబ్ సీఎంను అరెస్ట్ చేయండి: అసోం సీఎం డిమాండ్!

Drukpadam

రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ….?

Drukpadam

రాహుల్ గాంధీపై బీహార్‌లోనూ పరువునష్టం కేసు!

Drukpadam

Leave a Comment