Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీచేస్తామంటూ 19 మంది దరఖాస్తు!

హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీచేస్తామంటూ 19 మంది దరఖాస్తు!
అక్టోబరు 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్, బీజేపీ
స్పందించిన కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ
ఈ నెల 30 తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడి

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీయం ఇంకొంచెం వేడెక్కింది. హుజూరాబాద్ బరిలో దింపే అభ్యర్థులపై అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా స్పష్టతతో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎటూ తేల్చలేదు. దీనిపై పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ స్పందించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటివరకు 19 మంది దరఖాస్తు చేసుకున్నారని రాజనర్సింహ వెల్లడించారు. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పీసీసీకి నివేదిక అందించినట్టు తెలిపారు.

సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లను తుది జాబితాలో చేర్చామని, ఈ నెల 30న భూపాలపల్లి సభ అనంతరం హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తామని వివరించారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ ఆలస్యానికి కారణం ఏమిటి కౌశిక్ రెడ్డి టీఆర్ యస్ లో చేరటమేనా అనే అభిప్రాయాలూ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో పోటీచేసిన కౌశిక్ రెడ్డి సడన్ గా పార్టీకి హ్యాండ్ ఇవ్వడంతో పార్టీ కొంత సందిగ్ధంలో పడింది. ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే మీమాంసలో వివిధ పేర్లను పరిశీలించింది. మాజీమంత్రి కొండా సురేఖ ను అభ్యర్థిగా పెడతారని ప్రచారం జరిగింది . ఆమె కూడా పోటీకి ఒప్పుకున్నారని అయితే వరంగల్ లో సీటుకు కూడా అడిగారని వార్తలు వచ్చాయి. తరువాత కాంగ్రెస్ పార్టీ హుజారాబాద్ లో పోటీచేసేందుకు ఆసక్తి గా ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చునని ఆహ్వానినించింది. దీంతో 19 మంది అభ్యర్థులు పోటీకోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 4 గురు దరఖాస్తులను ఫైనల్ చేసినట్లు ఎన్నికల సంఘం చైర్మన్ హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి దామోదర రాజనరసింహ తెలిపారు .

Related posts

మమ్మల్ని చంపేయ్…లేదా నువ్వు చస్తావ్…కొడాలినాని బుద్ధా వెంకన్న వార్నింగ్…!

Drukpadam

వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారా?

Drukpadam

గంట సేపు కోదండ‌రాం మౌన‌దీక్ష…..

Drukpadam

Leave a Comment