Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ ప్రయాణమెటు …?

పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ ప్రయాణమెటు …?
-బీజేపీలో చేరను… కాంగ్రెస్ లో ఉండను: అమరీందర్ సింగ్ స్పష్టీకరణ
-52 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నా
-ఇప్పుడు నా విశ్వసనీయత ప్రమాదంలో పడినట్టే కదా?
-నమ్మకం లేనప్పుడు ఎవరూ కొనసాగలేరు

బీజేపీ లో చేరాను కాంగ్రెస్ లో ఉండను …సిద్ధుని సీఎం కానివ్వను… మరి ఇదెలా సాధ్యం ..అంటే చూస్తారుగా అంటున్నారు పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ …కాంగ్రెస్ తో 52 సంవత్సరాల ప్రయాణానికి ముగింపు అంటున్నారు. …కాంగ్రెస్ పార్టీ కి ఏంటో చేశా ?పార్టీ నన్ను అవమాన పరిచింది .అందువల్ల కాంగ్రెస్ తో ప్రయాణం ఇక కుదరదని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో నిన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలవడంపై విలేకర్లు ప్రశ్నించగా బీజేపీ చేరబోనని స్పష్టం చేశారు. అమరిందర్ ను సొంత పార్టీ పెట్టుకోమని అందుకు బీజేపీ సపోర్ట్ ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. … అందువల్ల అమరిందర్ సొంత పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నారని సమాచారం ….

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒత్తిడి మేరకు పంజాబ్ సీఎం పదవికి ఇటీవలే అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో గంటకు పైగా సమావేశమయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే వార్తలకు బలం చేకూరింది. అయితే, ఈరోజు అమరీందర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరబోనని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగలేనని క్లారిటీ ఇచ్చారు.

“ఇంత కాలం కాంగ్రెస్ తో కలిపి ప్రయాణం చేయడం సంతోషంగా ఉంది. నా పరిస్థితి ఏమిటో ఇప్పటికే నేను స్పష్టంగా చెప్పాను. నా పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం బాధాకరం. పార్టీకి ఇంత సేవ చేసిన నా పట్ల ఇలా వ్యవహరించి ఉండకూడదు. 52 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను.

నాకంటూ కొన్ని సిద్ధాంతాలు, నమ్మకాలు ఉన్నాయి. ఉదయం 10.30 గంటలకు సీఎం పదవికి రాజీనామా చేయాలని పార్టీ ప్రెసిడెంట్ ఆదేశించారు. నేను వారిని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఇప్పుడే చేస్తానని చెప్పాను. అదే రోజు సాయంత్రం నేను గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను అందించాను. 50 ఏళ్ల తర్వాత నన్ను మీరు అనుమానిస్తే, నా విశ్వసనీయత ప్రమాదంలో పడినట్టే కదా? నాపై నమ్మకం లేకపోతే… కాంగ్రెస్ లో ఉండి ఏం ప్రయోజనం? నమ్మకం లేనప్పుడు ఎవరూ కొనసాగలేరు” అని అమరీందర్ వ్యాఖ్యానించారు.

అమిత్ షాతో భేటీ కావడంపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా… తాను బీజేపీలో చేరడం లేదని సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఇంత వరకు రాజీనామా చేయలేదని చెప్పారు. తాను క్షణాల్లో నిర్ణయం తీసుకునే వ్యక్తిని కాదని అన్నారు.

Related posts

నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బుతో పారిపోయిన అష్రాఫ్ ఘనీ!

Drukpadam

కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ షాకింగ్ కామెంట్స్!

Drukpadam

చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన వైసీపీ ఎమ్మెల్యే!

Drukpadam

Leave a Comment