Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అక్టోబర్ 9న దళిత బంధు కై చలో హైదరాబాద్…

అక్టోబర్ 9న దళిత బంధు కై చలో హైదరాబాద్…
-దళితబందు అందరికి వర్తింప చేయాలి
-ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ నియమించాలి
-ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదార్లు పట్టకుండా చూడాలి
-ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయండి
-కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపు…

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను నియమించాలని, దళిత బంధు ను రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 9న కెవిపిఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద జరుగు దళితుల మహాధర్నాను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు.
సోమవారం స్థానిక ఎన్నెస్పీ క్యాంప్ లోని సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు పాపిట్ల సత్యనారాయణ అధ్యక్షతన కెవిపిఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ దళితులు, గిరిజనులపై రాష్ట్రంలో అనేకచోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరని, దళితులకు అన్యాయం జరిగితే తమ గోడు చెప్పుకోవడానికి ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ లేక తలలేని మొండెం లాగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చైర్మన్ ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు పథకాన్ని అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణం కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎస్సి కార్పొరేషన్ రుణాలు అందించాలన్నారు. పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్నారని వారు విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దళిత వాడలను అభివృద్ధి చేసేందుకు నిర్ధిష్టంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 9వ తేదీన జరుగు మహాధర్నాలో దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు కుక్కల సైదులు, బొట్ల సాగర్, నకరికంటి చిరంజీవి, మట్టే దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

 

Related posts

కాంగ్రెస్ పార్టీనే దేశానికి శ్రీరామ రక్ష … కొన్ని పార్టీలు కావాలని కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నాయి : భట్టి

Drukpadam

అమరావతిలో సవాళ్లు, ప్రతి సవాళ్లు.. టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ అరెస్టు!

Drukpadam

ఉద్దవ్ కు కొత్త తలనొప్పి …ముర్ము కు మద్దతుపై కాంగ్రెస్ గరం గరం ….

Drukpadam

Leave a Comment