Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్ ల సమస్యలను ప్రధాన మంత్రికి దృష్టికి తీసుకు వెళ్తా … కేంద్రమంత్రి కిషన్ రెడ్డి !

జర్నలిస్ట్ ల సమస్యలను ప్రధాన మంత్రికి దృష్టికి తీసుకు వెళ్తా … కేంద్రమంత్రి కిషన్ రెడ్డి !
-ఐ జె యూ కార్యవర్గసమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కిషన్ రెడ్డి
-ఐ జె యూ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా భావిస్తా
-జర్నలిస్టలను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తా
-కరోనా కష్టకాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జర్నలిస్టులు విధులు నిర్వహించారు

ఐ జె యూ సమావేశంలో చర్చిన జర్నలిస్ట్ సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళతానని
కరోనా కష్టకాలంలో సమాచార సేకరణ కోసం  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పాత్రికేయులను ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా గుర్తించేలా కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి  స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని టూరిజం ప్లాజా హోటల్ లో జరిగిన రెండు రోజుల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో పాత్రికేయులు ఆస్పత్రుల్లోకి తనతో పాటుగా ఐసీయూ లోకి సమాచార సేకరణ కోసం వచ్చారని గుర్తు చేసుకున్నారు. దేశంలో అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐజేయూ జాతీయ కార్యవర్గ  సమావేశంలో పాల్గొనే అవకాశం తనకు దక్కడం గర్వంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జరిగిన  చర్చను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తింపు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా పెరగడంతో అసత్య ప్రచారాలు కూడా కొన్ని సందర్భాల్లో చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలను వార్తలుగానే రాయాలని విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

రాష్ట్ర పర్యాటక , ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాటాడుతూ తెలంగాణాలో జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో మరణించిన జర్నలిస్టులకు 2 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధికి కృషిచేస్తున్నామని అన్నారు.తెలంగాణాలో గోల్కొండ ,చార్మినార్ , రామప్ప, నాగార్జన కొండ,సాలార్ జంగ్ మ్యూజియం , లాంటి చారిత్రిక ప్రదేశాలను మంత్రి ప్రస్తావించారు.

కోవిడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
-ఐజేయూ తీర్మానాలు

రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగిన ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశం పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించింది.

దేశ వ్యాప్తంగా కోవిడ్ బారినపడి మృతి చెందిన దాదాపు 600 మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో హత్యలకు గురైన ఐదు జర్నలిస్టుల కుటుంబాలకు పరిహారం అందించాలని మరో తీర్మానంలో ఐజేయూ డిమాండ్ చేసింది.

ప్రెస్ కౌన్సిల్ ఛైర్మెన్ జస్టీస్ సి.కె.ప్రసాద్ నియంతృత్వ, చట్ట వ్యతిరేక చర్యలను ఐజేయూ తీర్మానంలో తీవ్రంగా గర్హించింది. జాతీయ యూనియన్లకు 14వ, కౌన్సిల్ లో ప్రాతినిధ్యం లేకుండా చేసిన జస్టీస్ ప్రసాద్ చర్యలపై న్యాయపోరాటాన్ని సాగించాలనే తీర్మానాన్ని ఆమోదించారు.

దేశంలో జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై సంఘ వ్యతిరేక శక్తులు, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సాగిస్తున్న కక్ష్య సాధింపు చర్యలను సమావేశం తీవ్రంగా ఖండించింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మీడియా రంగాన్ని బలహీనపరిచే చర్యలకు స్వస్తి పలకాలని సమావేశం డిమాండ్ చేసింది.

కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చేంత వరకు వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కొనసాగించాలని సమావేశం డిమాండ్ చేసింది.

ప్రకటనలు సేకరించాల్సిందిగా టార్గెట్లు విధిస్తూ జర్నలిస్టులను వేధిస్తున్న యాజమాన్యాలు తమ వైఖరిని మార్చుకోవాలని ఐజేయూ కార్యవర్గ సమావేశం హెచ్చరించి. ఇటీవల మెదక్ జిల్లా నర్సాపూర్ లో విలేఖరి ప్రవీణ్ కుమార్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఐజేయూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి సదరు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను ఐజేయూ డిమాండ్ చేసింది.

Related posts

బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్!

Drukpadam

అంబానీ నంబర్ 2.. అదానీ నంబర్ 1: ఫోర్బ్స్ తాజా లెక్కలు!

Drukpadam

గోల్డెన్ సూట్ కేసుతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన నాగచైతన్య… ఎలిమినేట్ అయింది ఎవరంటే…!

Drukpadam

Leave a Comment