Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు అరవింద్ …అబద్ధాలకోరు కేసీఆర్ …బండి సంజయ్ …

కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు అరవింద్అబద్ధాలకోరు కేసీఆర్బండి సంజయ్
కేసీఆర్ కచ్చితంగా జైలుకు వెళతారు: బీజేపీ ఎంపీ అర్వింద్
కేసీఆర్ చేసిన అవినీతే ఆయనను జైలుకు పంపిస్తుంది
హుజూరాబాద్ ఓటమిని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు
సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడం మంచిది
కేసీఆర్ నా మెడ ఎప్పుడు నరుకుతాడో చెప్పాలి: బండి సంజయ్
కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే
రైతు చట్టాల విషయంలో కూడా పూటకో మాట మాట్లాడారు
పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధం

కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో పెట్టిన మీడియా సమావేశంపై బీజేపీ ఎంపీలు బండిసంజయ్ ,అరవింద్ లు స్పందించారు. కేసీఆర్ హుజురాబాద్ ఓటమిని తట్టుకోలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అసహనం , భయం ,అపనమ్మకం ఆయనలో కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు . హైద్రాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో వారు మీడియా తో మాట్లాడుతూ కేసీఆర్ విధానాలపై నిప్పులు చెరిగారు. 2023 ఎన్నికల్లో టీఆర్ యస్ ఓటమి ఖాయమని అన్నారు . బిడ్డ నన్ను జైలుకు పంపుతావా ? ఎన్ని గుండెలు , ఎంత దైర్యం కేసీఆర్ పై చేయి వేస్తె ….అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అరవింది తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ తప్పక జైలుకు వెళతారని ఉద్గాటించారు.ఆయన చేసిన తప్పులే జైలుకు పంపిస్తాయని అన్నారు. నామెడ ఎప్పుడు నరుకుతాడో కేసీఆర్ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒక రోజు కచ్చితంగా జైలుకు పోకతప్పదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆయన చేసిన అవినీతే ఆయనను జైలుకు పంపిస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన అవినీతిపై ఆధారాలు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తామని చెప్పారు.

కేసీఆర్ కు మతిమరుపు ఎక్కువైందని అర్వింద్ అన్నారు. ఆయనిక సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడం బెటర్ అని చెప్పారు. వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. రైస్ మిల్లులను ఆధునికీకరించుకోవాలని మాత్రమే రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్రం పేర్కొందని చెప్పారు.

హుజూరాబాద్ లో సర్వశక్తులను ఒడ్డినా, కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఓటమిపాలు కావడాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని అర్వింద్ అన్నారు. బీజేపీ సాధించిన ఘన విజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని విమర్శించారు. రాష్ట్రంపై కేంద్రం పెత్తనం ఏందని నిలదీసే కేసీఆర్… మళ్లీ, ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని అంటారని ఎద్దేవా చేశారు. వరి కొంటామని అగస్టు 31వ తేదీనే కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని… కానీ, లేఖ రాయలేదని కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకసారి వరి వేయాలని, మరొకసారి వేయవద్దని చెపుతూ రైతులను తికమకపెడుతున్నారని దుయ్యబట్టారు.

రైతు చట్టాల విషయంలో కూడా కేసీఆర్ పూటకో మాట మాట్లాడారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ పండుతోందో కేసీఆర్ చూపించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద స్కాం చేశారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీకి వెళ్తే కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోరని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్యానించారు. లీటర్ పై కేంద్రానికి రూ. 27 వస్తే రాష్ట్రానికి రూ. 28 వస్తోందని అన్నారు. కేంద్రానికి వెళ్లే రూ. 27లో రాష్ట్రానికి మళ్లీ రూ. 12 తిరిగి వస్తాయని చెప్పారు.

తన మెడ నరుకుతాననని కేసీఆర్ అన్నారని… ఎప్పుడు నరుకుతారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తనకు ఇంగ్లీష్, హిందీ రాదని కేసీఆర్ అన్నారని.. తాను పేద ప్రజల మనసులోని బాధలను, కష్టాలను చదువుకున్నానని చెప్పారు. మందు తాగి బండి నడిపితే తప్పయినప్పుడు… మందు తాగి ప్రభుత్వాన్ని నడపడం కూడా తప్పేనని అన్నారు.

Related posts

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షుడిగా తాతా మధు… ఎవరి ఛాయస్ …

Drukpadam

అప్పుల ఊబి లో జగన్ సర్కార్ …క్షిణించిన ఆర్ధిక పరిస్థితి :ఉండవల్లి!

Drukpadam

ఇక చుట్టపు చూపు కాదు …ఖమ్మంలోనే ఉంటా …రేణుకాచౌదరి!

Drukpadam

Leave a Comment