Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజధానిపై అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు సీజే!

  • -మూడు రాజధానుల అంశంపై వందకు పైగా పిటిషన్లు
  • -గత రెండ్రోజులుగా వాదనలు
  • -అమరావతి అందరికీ రాజధాని అవుతుందన్న సీజే
  • -రైతులు 30 వేల ఎకరాలు ఇచ్చారని వెల్లడి

అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ లో వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు ఆశక్తిగా మారాయి. అమరావతి అనేది అందరి రాజధాని కొందరిది కాదు . వైజాగ్ , కర్నూల్ ప్రాంతాలవాళ్ళకు కూడా రాజధానే ఇందులో ఎవరికీ సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఇప్పటికే 700 రోజులకు పైగా దీక్షలు చేస్తున్న రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతొ తిరుమలకు కాలినడక యాత్ర చేపట్టారు. సి జె వ్యాఖ్యలు యాత్ర చేస్తున్న రైతులకు కొంత ఊరట నిచ్చాయి. అయితే సి జె చేసిన వ్యాఖ్యలు వేరే అర్థంలో ఇచ్చారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే వాదనలు వింటున్న న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది. ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది. రాజధాని ఏర్పాటు రాష్ట్రప్రభుత్వ అభీష్టం మేరకు జరుగుతుందా ?లేదా ? న్యాయస్థానాల జోక్యం ఎంతవరకు ఉంటుంది. అనే దానిపై ఆశక్తి నెలకొన్నది.

అమరావతి రాజధాని అంశంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని అంటే కర్నూలు, వైజాగ్ ఇలా అన్ని ప్రాంతాలకు రాజధాని అని పేర్కొన్నారు. ఆ విధంగా ఏపీ రాజధాని అమరావతి రైతులకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని అందరికీ రాజధాని అవుతుందని అభిప్రాయపడ్డారు. 

నాడు స్వాతంత్ర్య సమరయోధులు తమ కోసం తాము పోరాడలేదని, వారు దేశ ప్రజలందరి స్వాతంత్ర్యం కోసం పోరాడారని సీజే ప్రశాంత్ కుమార్ ఉదహరించారు. దేశానికి లభించిన స్వాతంత్ర్యం స్వాతంత్ర్య సమరయోధులకు మాత్రమే సొంతం కాలేదని, దేశ ప్రజలదరికీ ఆ స్వాతంత్ర్యం లభించిందని వివరించారు. అమరావతి కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని వెల్లడించారు.  

ఏపీలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో 100కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ గతంలోనే ప్రారంభం కాగా తొలుత జేకే మహేశ్వరి, ఆ తర్వాత అరూప్ గోస్వామి సీజేలుగా వ్యవహరించారు. కానీ వారు విచారణ మధ్యలోనే బదిలీ అయ్యారు. తాజాగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ నేతృత్వంలో విచారణ షురూ అయింది. ఈ పిటిషన్లపై గత రెండ్రోజులుగా వాదనలు జరుగుతున్నాయి.

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కాం తో తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉందా?

Drukpadam

అమెరికా, జపాన్, యూరప్‌లో విరుచుకుపడుతున్న భానుడు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..

Drukpadam

ఖమ్మం లో పోలీస్ ,డాక్టర్స్ మధ్య క్రికెట్ మ్యాచ్…దుమ్మురేపిన పోలీస్ జట్టు!

Drukpadam

Leave a Comment