Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్ అంటూ కళ్లలో చుక్కలు వేసి బంగారు గొలుసు చోరీ!

కరోనా వ్యాక్సిన్ అంటూ కళ్లలో చుక్కలు వేసి బంగారు గొలుసు చోరీ!

  • కర్నూలులో ఘటన
  • స్టాంటన్ పురంలో నివసిస్తున్న కళావతమ్మ
  • కళావతమ్మ ఇంటికి ఓ మహిళ రాక
  • వ్యాక్సిన్ వేస్తామంటూ కళ్లలో చుక్కల మందు
  • కళ్లు మూసుకోగానే బంగారు గొలుసుతో పరార్

కర్నూలులో ఓ కిలాడీ కరోనా వ్యాక్సిన్ పేరుతో చోరీకి పాల్పడింది. పట్టణంలోని స్టాంటన్ పురం కాలనీలో కళావతమ్మ అనే మహిళ నివసిస్తోంది. కాగా, కరోనా వ్యాక్సిన్ వేస్తున్నామంటూ ఓ మహిళ కళావతమ్మ ఇంటికి వచ్చింది. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు కళ్లలో చుక్కల మందు వేసుకోవాలని నమ్మించింది. నిజమేనని భావించిన కళావతమ్మ కళ్లలో చుక్కల మందు వేయించుకుంది.

మందు కారణంగా కళావతమ్మ కళ్లు మూసుకోవడంతో ఆమె మెడలోని బంగారు గొలుసును ఆ మాయలాడి తెంచుకుని పారిపోయింది. దాంతో కళావతమ్మ కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. అప్పటికే ఆ మహిళ అక్కడ్నించి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Related posts

హైద్రాబాద్ లో కాల్పుల కలకలం …

Drukpadam

జేడీయూ సీనియర్ నేత కైలాశ్ మహతో దారుణ హత్య!

Drukpadam

ఉబర్ డ్రైవర్ మెసేజ్ చూసి భయపడి పోయిన ప్రయాణికుడు …

Ram Narayana

Leave a Comment