Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముగిసిన సూర్య గ్రహణం… ఏపీలో మళ్లీ తెరుచుకుంటున్న ఆలయాలు!

ముగిసిన సూర్య గ్రహణం… ఏపీలో మళ్లీ తెరుచుకుంటున్న ఆలయాలు!

  • నేడు పాక్షిక సూర్యగ్రహణం
  • ఈ సాయంత్రం ముగిసిన గ్రహణ ఘడియలు
  • ప్రముఖ ఆలయాల్లో సంప్రోక్షణ
  • ఆలయ శుద్ధి అనంతరం దర్శనాలకు అనుమతి

పాక్షిక సూర్య గ్రహణం కారణంగా ఏపీలోని ప్రముఖ ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం గ్రహణ ఘడియలు ముగిసిన నేపథ్యంలో, ఆలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో సంప్రోక్షణ, ప్రదోష కాల పూజల అనంతరం శ్రీవారి ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఈ రాత్రి 8.30 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నారు.

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయ ద్వారాలను కూడా తెరిచారు. వేదపండితులు ఆలయ శుద్ధి నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.

ఇక, సూర్య గ్రహణం అనంతరం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయ ద్వారాలను తిరిగి తెరిచారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజల అనంతరం రాత్రి 8 గంటల నుంచి భక్తుల దర్శనాలకు అనుమతించారు.

Related posts

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో చెల్ల‌ని సీత‌క్క ఓటు…

Drukpadam

టెస్లా అనుకుంటే పోర్షే ముందొచ్చింది… భారత మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు!

Drukpadam

న్యాయవస్థలో లోపాలపై సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment