Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఫ్రాన్స్ లో అల్లర్లు …అర్జెంటీనాలో సంబరాలు ఫిఫా కప్ ఫైనల్ !

అర్జెంటీనాలో కళ్లు చెదిరేలా సంబరాలు.. !

  • బ్యూనోస్ ఎయిర్స్ లో రహదారులన్నీ ప్రజలతో ప్యాకప్
  • ఒకే చోట 20 లక్షల మంది చేరికతో అంబరాన్నంటిన సంబరాలు
  • విజయంతో తమ ఆర్థిక కష్టాలను మర్చిపోయిన ప్రజలు
Millions Celebrate World Cup Victory At Iconic Argentina Monument

ఫుట్ బాల్ ప్రపంచ విజేతగా అర్జెంటీనా నిలవడంతో, ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు సెంట్రల్ బ్యూనోస్ ఎయిర్స్ లోని ఒబెలిస్క్ వద్ద చేరిపోయారు. సుమారు 20 లక్షల మంది ప్రజలు ఒకే చోట చేరారు. విజయం తాలూకూ సంబరాల వీడియో ట్విట్టర్ పైకి చేరాయి.

ఫ్రాన్స్-అర్జెంటీనా జట్ల మధ్య చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో అంతిమంగా విజయం అర్జెంటీనాను వరించడం తెలిసిందే. ‘‘ఇది ప్రతి ఒక్కరికీ సంతోషకరం. ఈ రోజు మా వంతు వచ్చింది. ఆనందం మాది’’ అని డీ మాయో స్వేర్  కు చెందిన ఓ హోటల్ రిసెప్షనిస్ట్ పేర్కొన్నారు.

ఈ విజయంతో అర్జెంటీనా ప్రజలు తమ ఆర్థిక కష్టాలను కొన్ని రోజుల పాటు అయినా మార్చిపోతారనే చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్లుగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో, పడిపోతున్న కరెన్సీ విలువతో అర్జెంటీనా ఆర్థిక కష్టాలను చవిచూస్తోంది. దేశంలోని 4.5 కోట్ల ప్రజల్లో 40 శాతం మంది పేదరికంలో ఉన్నవారే. ఆర్థికంగా దేశం ఎన్నో కష్టాలను చూస్తోందని, నెలాఖర్లో అవసరాలు తీరడం కష్టంగా ఉంటుందని ఓ నిర్మాణ రంగ కార్మికుడు పేర్కొనడం గమనార్హం. కానీ, తాము బాధపడిన ప్రతిదానికీ ఈ విజయం ప్రతిఫలాన్నిచ్చిందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఓటమిని జీర్ణించుకోని అభిమానులు.. ఫ్రాన్సులో చెలరేగిన అల్లర్లు

ఖతర్‌లో గత రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటినా చేతిలో పరాజయం తర్వాత ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగాయి. ఓటమిని జీర్ణించుకోని ఫ్రాన్స్ అభిమానులు రాజధాని పారిస్, నీస్, లయాన్ నగరాల్లో పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి అల్లర్లకు పాల్పడ్డారు. వీధుల్లోకి భారీగా తరలివచ్చి వీరంగమేస్తున్న అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

వీధుల్లోకి వచ్చిన సాకర్ అభిమానుల్లో కొందరు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. బాణసంచా కాల్చి వారిపై విసిరారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానా కష్టాలు పడ్డారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతం నుంచి కారులో వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై లయాన్ నగరంలో దాడి జరిగినట్టు ఓ ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చాడు.

ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు చివరికి బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. మ్యాచ్ తర్వాత వేలాదిమంది ఫుట్‌బాల్ అభిమానులు వీధుల్లోకి చొచ్చుకొచ్చి ఆందోళనకు దిగినట్టు ‘డెయిలీ మెయిల్’, ‘ది సన్’ వంటి పత్రికలు పేర్కొన్నాయి. బాష్పవాయువు ప్రయోగంతో సాకర్ అభిమానులు పరుగులు తీయడం కొన్ని వీడియోల్లో కనిపించింది. వెనక్కి వెళ్లిపోవాలంటూ ఆందోళనకారులను పోలీసులు హెచ్చరించడం కూడా వీడియోల్లో వినిపిస్తోంది. కాగా, ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా 14 వేల మంది పోలీసులను మోహరించారు. అయినప్పటికీ అల్లర్లును ఆపలేకపోయారు.

Related posts

ప్రకాశం జిల్లాలో ఎస్ ఐ ,రెవెన్యూ అధికారి ఫారెన్ టూర్ పై వివాదం ….?

Drukpadam

సినీ స్టూడియోల నిర్మాణం కోసం విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతిలో భూసేకరణ!

Drukpadam

ఉచితాల‌ను ఆప‌క‌పోతే.. ప్ర‌తి రాష్ట్రం ఓ శ్రీలంకే: జేపీ వార్నింగ్‌

Drukpadam

Leave a Comment